News December 27, 2024
వరంగల్ మార్కెట్లో చిరు ధాన్యాల ధరల వివరాలు

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు వివిధ రకాల చిరు ధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. శుక్రవారం క్వింటా మొక్కజొన్న ధర రూ.2,505 పలకగా ఈరోజు రూ.2,490 ధర పలకింది. సూక పల్లికాయ ధర రూ. 6,200, పచ్చి పల్లికాయ రూ.5,200 పలికాయి. అలాగే కొత్త 341 రకం మిర్చి రూ.14వేలు, కొత్త తేజ మిర్చి రూ. 16,016, దీపిక మిర్చి రూ.13 వేలు పలికినట్లు రైతులు తెలిపారు.
Similar News
News November 17, 2025
వరంగల్: ‘గురుకుల పాఠశాల కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలి’

వరంగల్ జిల్లాలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలలకు భోజన సరఫరా చేసే క్యాటరింగ్ కాంట్రాక్టర్లు, తమ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, పెరిగిన మార్కెట్ ధరలను దృష్టిలో పెట్టుకొని రేట్లను సవరించాలని కోరుతూ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారానికి వినతిపత్రం అందజేశారు. గత నాలుగు నెలలుగా బిల్లులు విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణరావు తెలిపారు.
News November 17, 2025
వరంగల్: ‘గురుకుల పాఠశాల కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలి’

వరంగల్ జిల్లాలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలలకు భోజన సరఫరా చేసే క్యాటరింగ్ కాంట్రాక్టర్లు, తమ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, పెరిగిన మార్కెట్ ధరలను దృష్టిలో పెట్టుకొని రేట్లను సవరించాలని కోరుతూ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారానికి వినతిపత్రం అందజేశారు. గత నాలుగు నెలలుగా బిల్లులు విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణరావు తెలిపారు.
News November 17, 2025
వరంగల్: ప్రజావాణిలో 124 వినతుల స్వీకరణ

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ జి.సంధ్య రాణి హాజరై ప్రజలు ఇచ్చిన వినతులను స్వయంగా స్వీకరించారు. ఈరోజు నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 124 దరఖాస్తులు స్వీకరించారు. వీటిలో అధిక శాతం రెవెన్యూ, జీడబ్ల్యూఎంసీ సమస్యలకు సంబంధించినవని అధికారులు పేర్కొన్నారు.


