News December 27, 2024
నరసరావుపేట: వివాహిత అనుమానాస్పద మృతి

నరసరావుపేట మండలం గురవాయపాలెం ఎస్సీ కాలనీలో భార్యను చంపి ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా భర్త నమ్మించే ప్రయత్నం చేసిన ఉదంతం శుక్రవారం జరిగింది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. భార్య గార్నేపూడి అనితపై అనుమానంతో భర్త రమేష్ కొట్టి చంపాడని, అనంతరం నైలాన్ తాడుతో ఉరి వేశాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నరసరావుపేట రూరల్ పోలీసులు తెలిపారు.
Similar News
News January 3, 2026
ANUలో విద్యార్థులకు క్యాంపస్ డ్రైవ్

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు శుక్రవారం క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహించిన ఈ డ్రైవ్లో భాగంగా ప్రీ ప్లేస్మెంట్, అసెస్మెంట్లో 150 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డా.ఎండీ తౌసిఫ్ అహ్మద్ తెలిపారు. క్వాలిఫై అయిన విద్యార్థులకు శనివారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
News January 2, 2026
విజయవాడలో నేటి నుంచి బుక్ ఫెస్టివల్

విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జనవరి 2 నుంచి 12 వరకు 35వ పుస్తక ప్రదర్శన జరగనుంది. నేడు ప్రముఖుల సమక్షంలో ప్రారంభం కానున్న ఈ ప్రదర్శనలో 280కి పైగా స్టాల్స్ను ఏర్పాటు చేశారు. గత 25 ఏళ్లలో కథ, నవల, కవిత, నాటక రంగాల్లో వచ్చిన మార్పులపై ప్రముఖులు చర్చా వేదికల్లో ప్రసంగించనున్నారు. యువ రచయితల పుస్తకాలు ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
News January 2, 2026
రాజ ముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ: కలెక్టర్

రాజ ముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభిస్తున్నామని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ కార్యక్రమం జనవరి 9వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారని చెప్పారు. జిల్లాలో మొత్తం 35,690 పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు.


