News March 16, 2024
2019లో ఓటర్ల సంఖ్య అలా.. ఇప్పుడిలా..!

ఓటర్ల వివరాలను సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. 2019 ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 89.6 కోట్లు కాగా, ప్రస్తుతం అది 96.8 కోట్లుగా ఉంది. ఇందులో పురుష ఓటర్లు 46.5 కోట్లు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 49.7 కోట్లకు చేరింది. మహిళా ఓటర్ల సంఖ్య 2019లో 43.1 కోట్లు ఉంటే.. ఇప్పుడు 47.1 కోట్లకు చేరింది. ఇక ట్రాన్స్జెండర్ల సంఖ్య 39,683 నుంచి 48,044కు.. దివ్యాంగ ఓటర్ల సంఖ్య 45.64 లక్షల నుంచి 88.35 లక్షలకు చేరింది.
Similar News
News April 7, 2025
STOCK MARKETS: రూ.19 లక్షల కోట్ల నష్టం!

భారత స్టాక్ మార్కెట్స్ సెషన్ ప్రారంభంలోనే సుమారు రూ.19 లక్షల కోట్లు కోల్పోయినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. సెన్సెక్స్ 3939, నిఫ్టీ 1160 పాయింట్ల మేర నష్టాలతో ప్రారంభమయ్యాయి. 2020 మార్చి తర్వాత ఇదే అత్యల్పం. మొత్తంగా 5 శాతానికి పైగా సంపద ఆవిరైంది. ఐటీ, మెటల్ సూచీలు 7 శాతం నష్టపోయాయి. మరోవైపు చైనా, జపాన్, కొరియా తదితర దేశాల మార్కెట్లు సైతం కుప్పకూలాయి.
News April 7, 2025
మూడు రోజుల్లో ₹3000 తగ్గిన బంగారం ధరలు!

అమెరికా విధించిన సుంకాలతో బంగారం ధరల పతనం కొనసాగుతోంది. ఇవాళ కూడా స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి నేడు ₹280 తగ్గి ₹90,380కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ ₹250 తగ్గి ₹82,850గా పలుకుతోంది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ రూ.1,02,900కి చేరింది. కాగా, గత మూడు రోజుల్లోనే కేజీ వెండిపై రూ.9,100, తులం బంగారంపై రూ.3000 తగ్గడం విశేషం.
News April 7, 2025
వాట్సాప్ యూజర్లకు అలర్ట్

ఆన్లైన్ మోసాల పట్ల వాట్సాప్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ నంబర్కి OTP పంపి, అనుకోకుండా పంపామని మోసగాళ్లు వాట్సాప్లో చాట్ చేస్తున్నారని తెలిపారు. వాట్సాప్ను హ్యాక్ చేసి సన్నిహితుల నంబర్లకు మీ పేరుతో డబ్బులు పంపించాలంటూ సందేశాలతో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలన్నారు.