News March 16, 2024
వందలాది కార్లతో ర్యాలీగా బయలుదేరిన మాగుంట

ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి శనివారం తాడేపల్లిలోని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒంగోలు నుంచి వందలాది కార్లతో తన అభిమానులు, కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. అద్దంకి బస్టాండ్ సెంటర్లో ఉన్న మాగుంట సుబ్బరామిరెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. తాడేపల్లి బయలుదేరి వెళ్లారు.
Similar News
News February 3, 2026
ఒక్క మాటతో IPS.. కనిగిరి వాసి సక్సెస్ స్టోరీ..!

“నా తర్వాతి సివిల్స్ విజేత ఇతనే” అని పదేళ్లక్రితం IPS ఆవుల రమేశ్రెడ్డి ఓ వేదికపై చెప్పినమాట అక్షర సత్యమైంది. పవన్ కుమార్ రెడ్డి 179వ ర్యాంకుతో ఆంధ్రాలో IPSకు ఎంపికయ్యారు. మార్కాపురం జిల్లా కనిగిరి మండలం పునుగోడుకు చెందిన ఈయన ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుమారుడు. అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తూనే నాలుగో ప్రయత్నంలో IPS సాధించారు. డాక్టర్ అవ్వాలనుకున్న ఈయన IPS రమేశ్ రెడ్డి ప్రోత్సాహంతో ఐపీఎస్ సాధించారు.
News February 3, 2026
ప్రకాశం: అరుదైన అవార్డు అందుకున్న డీడీ డా.జగత్ శ్రీనివాస్

ప్రకాశం జిల్లా పశు వైద్య ఆరోగ్యశాఖలో డిప్యూటీ డైరెక్టర్గా పని చేస్తున్న డాక్టర్ జగత్ శ్రీనివాస్కు అరుదైన అవార్డు వరించింది. జాతీయస్థాయిలో అందించే డాక్టర్ సీఎం సింగ్ సుశ్రుత గౌరవ రత్న సమ్మాన్ 2025 అవార్డులకు ఏపీ నుంచి ఇద్దరు ఎంపిక కాగా.. వారిలో డీడీ జగత్ శ్రీనివాస్ ఒకరు. ఈ సందర్భంగా ఏపీ పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్ దామోదర్ నాయుడు ఈయనకు సర్టిఫికెట్లను బహుకరించి ఘనంగా సన్మానించారు.
News February 3, 2026
ప్రకాశం: అరుదైన అవార్డు అందుకున్న డీడీ డా.జగత్ శ్రీనివాస్

ప్రకాశం జిల్లా పశు వైద్య ఆరోగ్యశాఖలో డిప్యూటీ డైరెక్టర్గా పని చేస్తున్న డాక్టర్ జగత్ శ్రీనివాస్కు అరుదైన అవార్డు వరించింది. జాతీయస్థాయిలో అందించే డాక్టర్ సీఎం సింగ్ సుశ్రుత గౌరవ రత్న సమ్మాన్ 2025 అవార్డులకు ఏపీ నుంచి ఇద్దరు ఎంపిక కాగా.. వారిలో డీడీ జగత్ శ్రీనివాస్ ఒకరు. ఈ సందర్భంగా ఏపీ పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్ దామోదర్ నాయుడు ఈయనకు సర్టిఫికెట్లను బహుకరించి ఘనంగా సన్మానించారు.


