News December 28, 2024
మొబైల్ రీఛార్జ్ ధరలు పెంపు?

టెలికం కంపెనీలు టారిఫ్ రేట్లను పెంచే అవకాశం ఉందని ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ వెల్లడించింది. వచ్చే ఏడాది DECలో 15% టారిఫ్ పెంచవచ్చని తెలిపింది. ARPU లెవెల్స్ పెంచుకునేందుకు టెలికం కంపెనీలు ఇక నుంచి తరచూ ఈ పద్ధతి కొనసాగించొచ్చని పేర్కొంది. కాగా గత ఐదేళ్లలో మూడు సార్లు (2019, 21, 24)టారిఫ్ పెంచారు. 2019 SEPలో రూ.98 ఉన్న రీఛార్జ్ ప్లాన్ 2024 SEPకు రూ.193కి ఎగబాకింది.
Similar News
News September 17, 2025
దేశవ్యాప్తంగా 16చోట్ల NIA సోదాలు

AP: విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో NIA మరోసారి తనిఖీలు చేపట్టింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, UP, ఝార్ఖండ్, బిహార్, ఢిల్లీ, మహారాష్ట్రలో మొత్తం 16చోట్ల సోదాలు చేసింది. ఏపీలో నిర్వహించిన సోదాల్లో డిజిటల్ పరికరాలు, నగదు, అనుమానాస్పద వస్తువులు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకుంది. జులై నెల VZMలో సిరాజ్ ఉర్ రెహ్మాన్ను NIA అరెస్టు చేయగా.. కేంద్రానికి వ్యతిరేకంగా కుట్ర పన్నినట్లు విచారణలో ఒప్పుకున్నాడు.
News September 17, 2025
మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి: పవన్

AP: సమాజంలో వైషమ్యాలు సృష్టించే శక్తులు పేట్రేగిపోతున్నాయని కలెక్టర్లు, SPల సదస్సులో Dy.CM పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ‘సామాజిక వర్గాల మధ్య అంతరాలు సృష్టించే విద్రోహ శక్తుల పట్ల నిరంతర అప్రమత్తత అవసరం. CM చంద్రబాబు శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యమివ్వండి. సుగాలి ప్రీతి కేసుపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. డ్రగ్స్ వ్యాప్తిపై ఉక్కుపాదం మోపాలి’ అని ఆదేశించారు.
News September 17, 2025
చరిత్రలో ఈ రోజు: సెప్టెంబర్ 17

✒ 1906: స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య జననం
✒ 1915: భారత చిత్రకారుడు MF హుస్సేన్ జననం
✒ 1929: భారతీయ కామిక్స్ సృష్టికర్త అనంత్ పాయ్ జననం
✒ 1943: రాజకీయ నాయకుడు, సినీ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి జననం
✒ 1950: ప్రధాని నరేంద్ర మోదీ(ఫొటోలో) జననం
✒ 1948: నిజాం పరిపాలన నుంచి హైదరాబాద్కు విముక్తి
✒ 1986: దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జననం