News March 16, 2024
కౌంట్డౌన్ @59

ఏపీలో ఎన్నికల నగారా మోగింది. నేటి నుంచి సరిగ్గా 59వ రోజు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెలువడనుంది. అభ్యర్థులు మే 11 సాయంత్రం 5 గంటలకు వరకు ప్రచారం చేసుకోవచ్చు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. దాదాపు 2 నెలల పాటు రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగనుంది.
Similar News
News November 1, 2025
IBM సహకారంతో నేషనల్ ‘AI LAB’

విద్యార్థులను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్లో తీర్చిదిద్దడంలో మరో ముందడుగు పడింది. ‘నేషనల్ AI ల్యాబ్’ ఏర్పాటుకు మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ IBM, AICTE వ్యూహాత్మక ఒప్పందం చేసుకున్నాయి. ఢిల్లీలో ఏర్పాటుకానున్న ల్యాబ్ పరిశోధన, నైపుణ్యం, నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా నిలువనుంది. 1000కి పైగా కోర్సుల ద్వారా 30M మందికి AI పరిజ్ఞానం అందనుంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు తదుపరి తరాన్ని అందించడంలో ఇది దోహదపడనుంది.
News November 1, 2025
అది చెడు పాలన ఫలితం: అజిత్ దోవల్

చెడు పాలన పరిణామాలతో బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్లో ప్రభుత్వాలు మారాయని NSA అజిత్ దోవల్ అన్నారు. ఆర్థిక వైఫల్యాలు, ఆహార కొరత, ద్రవ్యోల్బణం, సామాజిక సంఘర్షణలే వాటి పతనానికి కారణమని పేర్కొన్నారు. దేశాలను నిర్మించడంలో బలమైన పాలన ఎంతో ముఖ్యమని రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో చెప్పారు. దేశంలో టెర్రరిజాన్ని సమర్థంగా ఎదుర్కొన్నామని, J&K తప్ప ఎక్కడా 2013 నుంచి టెర్రర్ అటాక్ జరగలేదని తెలిపారు.
News November 1, 2025
ఆమెకు మతం మారే ఆలోచన లేదు: జేడీ వాన్స్

హిందువైన తన భార్య ఉష <<18155411>>క్రైస్తవంలోకి మారే <<>>ఛాన్స్ ఉందంటూ అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. దీంతో ఆయన క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశారు. తన భార్య క్రిస్టియన్ కాదని, మతం మారే ఆలోచన కూడా ఆమెకు లేదని చెప్పారు. అయితే ఏదో ఒకరోజు తాను చూసినట్లే తన భార్య చూస్తుందని భావిస్తున్నానని తెలిపారు. సువార్త నిజమని, అందరికీ మంచిదని క్రైస్తవం చెబుతుందని అన్నారు.


