News December 28, 2024

NLG: నిఘా నీడలో ఇంటర్ ప్రాక్టికల్స్ 

image

ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను నిఘానీడలో నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రయోగశాలల్లో సీసీ కెమెరాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని, దానికి కావాల్సిన ప్రతిపాదనలను వెంటనే బోర్డుకు పంపాలని ఈ నెల 23న ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 290 ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కళాశాలలో ఫిబ్రవరి మొదటివారం నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి.

Similar News

News February 5, 2025

నల్గొండ: మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ 

image

కనగల్ మండలంలో జీ.యడవల్లిలో విషాదం జరిగింది. విద్యుత్ షాక్‌కు గురై రైతు మృతిచెందాడు. హెడ్ కానిస్టేబుల్ ఎంఏ రషీద్ ఖాన్ తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన మన్నెం గోపి(32) ఉదయం 11 గంటల సమయంలో పొలానికి వెళ్లాడు. పొలం వద్ద బోరు మోటర్‌ను ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. మృతుడి తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 5, 2025

చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు.. ఎస్పీ సూచనలు 

image

చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం పరిశీలించారు. బందోబస్త్ ఏర్పాట్లను పర్యవేక్షణ చేసి, అధికారులకు పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

News February 5, 2025

చెర్వుగట్టులో ఆటో వాలాల దోపిడీ: భక్తులు

image

చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలలో ఆటోల దోపిడీకి అంతులేకుండా పోయిందని భక్తులు మండిపడుతున్నారు. గుట్టపైకి ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఆటోల డ్రైవర్లు భక్తుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటున్నారు. ఒక్కో భక్తుడి వద్ద గుట్ట పైకి వెళ్లడానికే రూ.20ల ఛార్జి తీసుకున్నారని చెబుతున్నారు. ఆటోలపై అధికారుల నియంత్రణ లేకపోవడం పట్ల భక్తులు మండిపడుతున్నారు.

error: Content is protected !!