News December 28, 2024
11 సీట్లు వచ్చినా దాడులు చేస్తుంటే ఉపేక్షించం: పవన్

YS జగన్ తన పార్టీ వర్గాలను నియంత్రించుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. 11 సీట్లు వచ్చినా ఇంకా దాడులు చేస్తుంటే మేము ఉపేక్షించమన్నారు. రాయలసీమ యువత ఇలాంటివి జరిగినప్పుడు ఎదుర్కోవాలని, మేము అండగా ఉంటామని నాయకులకు సైతం పవన్ భరోసానిచ్చారు. ఈరోజు మీరు భయపడటం వలనే జవహర్ బాబుపై దాడి జరిగిందన్నారు. పోలీసులే కాదు జనం కూడా ఇలాంటి వాటిపై స్పందించాలని, ఓట్లు వేసి పనైపోయిందని అనుకోకూడదన్నారు.
Similar News
News May 8, 2025
పెండ్లిమర్రిలో రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే

పెండ్లిమర్రి మండలంలోని కొత్తూరు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులను వేంపల్లి శ్రీరాంనగర్కు చెందిన బాలయ్య, రాజీవ్ నగర్కు చెందిన మల్లికార్జున, మదనపల్లెకి చెందిన మల్లికార్జునగా స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News May 8, 2025
పెండ్లిమర్రిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

పెండ్లిమర్రి మండలం కొత్తూరు వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. బైక్ను కంటైనర్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరొకరు వేంపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News May 8, 2025
కడప: రిమ్స్ ప్రిన్సిపల్గా డాక్టర్ జమున

కడప రిమ్స్ మెడికల్ కళాశాల నూతన ప్రిన్సిపల్గా డాక్టర్ జమున గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం కళాశాల సిబ్బంది ఆమెకు ఘనంగా స్వాగతం పలికి బొకేలు అందజేశారు. రిమ్స్ మెడికల్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె అన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటానని పేర్కొన్నారు.