News December 28, 2024
NZB: 2న జిల్లాకు ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్

ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ జస్టిస్ షమీం అక్తర్ గురువారం(జనవరి 2న) నిజామాబాద్ జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కుల సంఘాల సభ్యులు వర్గీకరణ విషయంపై దరఖాస్తులను కలెక్టరేట్లో సమర్పించాలని సూచించారు. దరఖాస్తు ఫారాలు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయం నిజామాబాద్, ఆర్మూర్, బోధన్లలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
Similar News
News November 8, 2025
KMR: లోన్ పేరుతో మోసం.. రూ.1.02 లక్షల టోకరా!

ఆన్లైన్ మోసంలో ఓ వ్యక్తి చిక్కుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. SI రాజశేఖర్ వివరాల ప్రకారం.. రామారెడ్డి(M) రెడ్డిపేట వాసి రాజు చరవాణికి వచ్చిన ముద్ర లోన్ ప్రకటన చూసి తన వివరాలు నమోదు చేయగా, ఓ వ్యక్తి ఫోన్ చేసి లోన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. లోన్ ప్రాసెసింగ్ ఫీజు పేరుతో బాధితుడి నుంచి 7 విడతలుగా రూ.1,02,960 బదిలీ చేయించుకున్నాడు. మోసపోయినట్లు తెలిసి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
News November 8, 2025
పసుపు సాగు పొలాలను సందర్శించిన ఎంపీ అర్వింద్

కమ్మర్ పల్లి మండల కేంద్రంలో పసుపు సాగు పొలాలను ఎంపీ అర్వింద్, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి శుక్రవారం సందర్శించారు. రైతులతో మాట్లాడి పసుపు ధరల పరిస్థితి, ఆకుల నుంచి నూనె తీసి అదనపు ఆదాయం పొందే యోచన గురించి తెలుసుకున్నారు. అలాగే, బోర్డు శాశ్వత కార్యాలయానికి స్థలం కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఛైర్మన్ను అడిగి తెలుసుకున్నారు.
News November 7, 2025
పసుపు సాగు పొలాలను సందర్శించిన ఎంపీ అర్వింద్

కమ్మర్ పల్లి మండల కేంద్రంలో పసుపు సాగు పొలాలను ఎంపీ అర్వింద్, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి శుక్రవారం సందర్శించారు. రైతులతో మాట్లాడి పసుపు ధరల పరిస్థితి, ఆకుల నుంచి నూనె తీసి అదనపు ఆదాయం పొందే యోచన గురించి తెలుసుకున్నారు. అలాగే, బోర్డు శాశ్వత కార్యాలయానికి స్థలం కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఛైర్మన్ను అడిగి తెలుసుకున్నారు.


