News December 28, 2024
మన్మోహన్ను కేంద్రం అవమానించింది: రాహుల్

భారతమాత ముద్దుబిడ్డ, తొలి సిక్కు ప్రధాని మన్మోహన్ సింగ్ను ప్రస్తుత ప్రభుత్వం అవమానించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటివరకు మాజీ ప్రధానులందరి అంత్యక్రియలను అధికారిక శ్మశానవాటికలో నిర్వహించారు. కానీ మన్మోహన్ చివరి కార్యక్రమాలు నిగమ్బోధ్ ఘాట్లో జరిపి అవమానించారు’ అని మండిపడ్డారు. అలాగే సింగ్కు మెమోరియల్ ఏర్పాటు చేసి, ఆయనపై గౌరవాన్ని చాటుకోవాలని సూచించారు.
Similar News
News January 8, 2026
ప్రసారభారతిలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

<
News January 8, 2026
ఫిబ్రవరి 3న మున్సిపల్ ఎన్నికలు: రాంచందర్ రావు

TG: రాష్ట్రంలో ఫిబ్రవరి 3న మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు చెప్పారు. ఎన్నికలకు ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చిందని, ఈ నెల 16 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. వరంగల్లో జరిగిన బీజేపీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎలక్షన్స్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎన్నికల తేదీలు ఇవేనంటూ ఈసీ కంటే ముందే రాంచందర్ రావు ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది.
News January 8, 2026
HT పత్తి విత్తనాలు కొనొద్దు: మంత్రి తుమ్మల

TG: HT పత్తి విత్తనాల అమ్మకాలను రాష్ట్రంలో అరికట్టాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. ఫీల్డ్ ట్రయల్స్లో ఫెయిలైనందున కేంద్రం ఆ కంపెనీ విత్తనాల అమ్మకాలకు పర్మిషన్ ఇవ్వలేదన్నారు. అధిక దిగుబడి వస్తుందనే ఆశతో రైతులు HT పత్తి విత్తనాలను కొని మోసపోవద్దని కోరారు. పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కో-మార్కెటింగ్కు విధివిధానాలు రూపొందించాలన్నారు.


