News December 28, 2024
అకౌంట్లోకి డబ్బులు.. BIG UPDATE

TG: సంక్రాంతి నుంచి రైతుభరోసా పథకం ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. సాగు చేసే భూమికే పెట్టుబడి సాయం చేస్తామన్నారు. ప్రస్తుతం వ్యవసాయ అధికారులు రైతుల పేర్లు నమోదు చేస్తున్నారని తెలిపారు. సర్వే నంబర్ల వారీగా గ్రామాల్లో సాగు వివరాలు సేకరిస్తున్నామన్నారు. రిమోట్ సెన్సింగ్ డాటా ఆధారంగా సాగు విస్తీర్ణం గుర్తించడంపై పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు.
Similar News
News February 2, 2026
ఫైనల్లో భారత్ ఎదురైతే.. పాక్కు మాజీల ప్రశ్న!

T20 వరల్డ్ కప్లో భారత్తో మ్యాచ్ ఆడకూడదన్న పాక్ నిర్ణయాన్ని ఆ దేశ మాజీ ప్లేయర్లే విమర్శిస్తున్నారు. ‘ఫస్ట్ మ్యాచ్ బాయ్కాట్ సరే.. మరి ఫైనల్లో భారత్ ఎదురైతే అప్పుడు ఆడకుండానే కప్పు వారికిచ్చేస్తారా?’ అని దానిశ్ కనేరియా ప్రశ్నించారు. ఇది పాక్ భయపడుతోందనే సంకేతం ఇస్తుందని విమర్శించారు. మరోవైపు ‘క్రికెట్ ద్వారా దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని, భారత్తో ఆడకపోవడం బాధాకరమని అఫ్రీది అభిప్రాయపడ్డారు.
News February 2, 2026
చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ తప్పదు: సజ్జల

AP: రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని, బందిపోట్ల మాదిరి TDP తమ నేతల ఇళ్లపై దాడులు చేస్తోందని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్ల ఆదేశాలతో అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై పోలీసుల సమక్షంలోనే గూండాలు దాడి చేశారని పేర్కొన్నారు. లడ్డూ అంశంలో దొరికిపోవడంతో CBN ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక CBNకి రిటర్న్ గిఫ్ట్ తప్పని సరిగా ఇస్తామని హెచ్చరించారు.
News February 2, 2026
18, 19 తేదీల్లో విశాఖలో ఫ్లీట్ రివ్యూ, మిలాన్

AP: మరో ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల 18న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, 19న మిలాన్-2026 జరగనున్నాయి. US, జర్మనీ, ఫ్రాన్స్ సహా 19 దేశాల నౌకలు, ఎయిర్క్రాఫ్ట్లు విన్యాసాలు చేయనున్నాయి. దేశవిదేశాలకు చెందిన 4K మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ ఫ్లీట్కు రాష్ట్రపతి, గవర్నర్, CM, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై CS విజయానంద్ ఇవాళ సమీక్ష నిర్వహించారు.


