News March 16, 2024

ఎలక్టోరల్ ట్రస్టులు కూడా బీజేపీకి ఫేవర్‌గానే! – 1/2

image

ఎలక్టోరల్ బాండ్స్‌తో పాటు ఎలక్టోరల్ ట్రస్టుల విరాళాలూ ఎక్కువగా బీజేపీకే అందినట్లు తెలుస్తోంది. 2022-23లో ఐదు ట్రస్టులు పార్టీలకు రూ.366కోట్లు ఇవ్వగా.. వీటిలో రూ.259కోట్లు బీజేపీకే వెళ్లాయి. అత్యధిక బాండ్స్ విరాళమిచ్చిన సంస్థల్లో రెండో స్థానంలో ఉన్న మేఘా ఇంజినీరింగ్ ప్రూడెంట్‌కు (బీజేపీ మద్దతుదారు) రూ.87కోట్లు ఇచ్చింది. FY17 నుంచి ప్రూడెంట్‌కు వచ్చిన కార్పొరేట్ డొనేషన్లలో 85% బీజేపీకే వెళ్లాయి.

Similar News

News April 17, 2025

చిన్నారుల భవిష్యత్తుకు అండగా ఉంటాం: సచిన్

image

చిన్నారుల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు సచిన్ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్ చేతులు కలిపాయి. మేఘాలయ ప్రభుత్వ భాగస్వామ్యంతో రెండు సంస్థలు పనిచేయనున్నాయి. ఈ మేరకు క్రికెట్ దిగ్గజం సచిన్ ట్వీట్ చేశారు. మూలాలపై దృష్టి పెట్టినప్పుడే నిజమైన మార్పు వస్తుందన్న విషయం మేఘాలయా పర్యటనతో అర్థమైందన్నారు. పిల్లల ఆత్మస్థైర్యం, లోకల్ టీమ్స్ నిబద్ధత ఈ ప్రయాణంలో తమకు స్ఫూర్తినిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

News April 17, 2025

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ఏలూరు, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. మరోవైపు అల్లూరి జిల్లా కూనవరం, చింతూరు మండలాల్లో రేపు తీవ్రమైన వడగాలులు వీచే ప్రభావం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News April 17, 2025

డ్రగ్స్ ఆరోపణలు.. స్పందించిన ప్రముఖ నిర్మాత

image

బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహర్ ఫొటో ఇటీవల సోషల్ మీడియాలో వైరలైన విషయం తెలిసిందే. డ్రగ్స్ వాడకం వల్లే అలా అయ్యారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై కరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. ‘నాకేం కాలేదు. చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నా బ్లడ్ లెవెల్స్ సరిగ్గా మెయింటేన్ చేయాలని డాక్టర్స్ సూచించారు. రోజుకు ఒక పూటే తింటున్నాను. కఠిన డైట్ వల్ల సన్నగా మారాను’ అని వివరించారు.

error: Content is protected !!