News December 29, 2024
నాగార్జునసాగర్ భద్రతపై కన్ఫ్యూజన్

నాగార్జునసాగర్ డ్యామ్ భద్రతపై గందరగోళం తలెత్తింది. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం నేపథ్యంలో CRPFకు కేంద్రం గతంలో బాధ్యతలు అప్పగించింది. డ్యామ్ భద్రతా విధుల నుంచి CRPF వైదొలుగుతున్నట్లు చెప్పడంతో తెలంగాణ SPF ఆ బాధ్యతలు స్వీకరించింది. మళ్లీ రాత్రి విధుల్లోకి CRPF సిబ్బంది వచ్చి భద్రతా బాధ్యతలు చేపట్టాయి. దీంతో ఏం జరుగుతుందనేది తెలియక స్థానిక అధికారులు అయోమయానికి గురయ్యారు.
Similar News
News November 4, 2025
‘వరద ముంపు నివారణకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి’

గ్రేటర్ వరంగల్కు వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపడానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డా. సత్య శారద, స్నేహ శబరీష్, జీడబ్ల్యుఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. కుడా కార్యాలయంలో వరద ముంపు నివారణపై సమీక్ష నిర్వహించి, సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
News November 4, 2025
160 సీట్లకు పైనే గెలుస్తాం: అమిత్ షా

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. 160కి పైగా స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, జేడీయూ సమాన సీట్లు సాధిస్తాయని అన్నారు. గత 11 ఏళ్లలో రోడ్లు, బ్రిడ్జిలు, పవర్ ప్లాంట్లు వంటి అతి ముఖ్యమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేశామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి అవకాశాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
News November 4, 2025
AP న్యూస్ అప్డేట్స్

✦ రైతులకు YCP ఏం చేసిందో అసెంబ్లీలో చర్చిద్దామా? జగన్కు మంత్రి అచ్చెన్నాయుడు సవాల్
✦ నకిలీ మద్యం కేసులో ఏడుగురిని కస్టడీకి ఇచ్చిన ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు.. ఈ నెల 7 నుంచి 11 వరకు నిందితులను ప్రశ్నించనున్న పోలీసులు
✦ మద్యం కేసు నిందితులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ బెయిల్ పిటిషన్లపై విచారణ ఈ నెల 7కు వాయిదా వేసిన విజయవాడ ACB కోర్టు.. కౌంటర్ వేయాలని సిట్కు ఆదేశం


