News March 16, 2024

వెంకటగిరి: వారసుల్లో పైచేయి ఎవరిదో ! 

image

వెంకటగిరి బరిలో నిలుస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ నేతల వారసులే. ఇద్దరికి ఇవే మొదటి ప్రత్యక్ష ఎన్నికలు. వైసీపీ అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి రాజ్యలక్ష్మిల కుమారుడు. టీడీపీ అభ్యర్థి లక్ష్మీ సాయిప్రియ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ కుమార్తె. జనార్దన్ రెడ్డి, రాజ్యలక్ష్మి, రామకృష్ణ ముగ్గురూ వెంకటగిరి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే. మరి వారసుల్లో పైచేయి ఎవరిదో.

Similar News

News October 1, 2024

నెల్లూరు: ఆరేళ్ల బాలికపై కన్నతండ్రి అఘాయిత్యం

image

నెల్లూరు జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అల్లూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన గోడ.వెంకటరమణయ్య తన ఆరేళ్ల కూతురుపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాలిక భయపడి కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

News October 1, 2024

గూడూరు చింతవరం వద్ద కాలేజీ బస్సు బోల్తా

image

చిల్లకూరు మండలం, చింతవరం గ్రామ సమీపంలో ఓ ప్రైవేట్ కాలేజీకి చెందిన బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో విద్యార్థులు ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న చిల్లకూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

News October 1, 2024

పాల సేకరణలో గణేశ్వర పురానికి జిల్లాలో ప్రథమ స్థానం

image

వరికుంటపాడు మండలంలోని గణేశ్వర పురం గ్రామానికి పాల సేకరణలో జిల్లాలో ప్రథమ స్థానం లభించింది. నెల్లూరులో జరిగిన పాల సొసైటీ సర్వసభ్య సమావేశంలో గ్రామానికి చెందిన పాల సొసైటీ ప్రెసిడెంట్, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ బాదం వెంకట్ నారాయణరెడ్డిను విజయ డైరీ ఛైర్మన్ కొండ రెడ్డి రంగారెడ్డి, మాజీ ఛైర్మన్ సుధీర్ రెడ్డి అభినందించారు. ఆయన ఈ ఏడాది మొత్తం మీద 1,86,572 లీటర్లు పాలు సేకరించారు.