News December 29, 2024

నిర్మల్‌లో మహిళపై అత్యాచారం.. వివరాలు వెల్లడించిన సీఐ

image

నిర్మల్‌లో మహిళపై అత్యాచారం జరిగిన ఘటన వివరాలను టౌన్ సీఐ శనివారం వెల్లడించారు. శుక్రవారం బస్టాండ్‌లో కానిస్టేబుల్ అనిల్ విధులు నిర్వహిస్తుండగా ఆటో డ్రైవర్ స్పృహ కోల్పోయి ఉన్న మహిళ వివరాలు తెలపారు. వారు బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. స్పృహలోకి వచ్చిన బాధితురాలు తనను యోగేష్ అనే వ్యక్తి లాడ్జికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడని తెలుపగా కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News February 5, 2025

ADB: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

image

ఆదిలాబాద్‌లో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లాండసాంగి గ్రామ సమీపంలోని రహదారిపై మహారాష్ట్ర పాటన్ బోరికి చెందిన షాలిక్‌కు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అతడిని 108లో ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News February 5, 2025

గుడిహత్నూర్‌లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కమలాపూర్ గ్రామానికి చెందిన భౌరే చిన్న గంగాధర్ (60) బైక్ పై ఆదిలాబాద్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో సీతాగొంది సమీపంలో ఉన్న హైమద్ ధాబా నుంచి యు టర్న్ తీసుకుంటుండగా ఓ కారు వచ్చి ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందినట్లు వెల్లడించారు.

News February 5, 2025

ADB: రైలు పట్టాలపై పడి మృతి

image

తిరుపతి దైవ దర్శనానికి వెళ్లిన వ్యక్తి మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరడిగొండ మండలం రెంగన్‌వాడి గ్రామానికి చెందిన సిడం చిత్రు (57), విఠల్‌తో కలిసి రైలులో ఇటీవల దైవదర్శనానికి తిరుపతికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు రైలు పట్టాలపై పడి చిత్రు మృతిచెందారు.

error: Content is protected !!