News December 29, 2024

14,300 అడుగుల ఎత్తులో ఛత్రపతి శివాజీ విగ్రహం

image

భారత్-చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్ సో సరస్సు తీరం వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది సముద్ర మట్టానికి 14,300 అడుగుల ఎత్తులో ఉంది. ఈ నెల 26న ఫైర్ అండ్ ఫ్యూరీ కోర్, మరాఠా లైట్ ఇన్‌ఫాంట్రీ కమాండర్లు విగ్రహాన్ని ఆవిష్కరించారని ఆర్మీ పేర్కొంది. విగ్రహం బలగాల్లో స్ఫూర్తి నింపడంతో పాట భారత వీరత్వాన్ని ప్రత్యర్థులకు గుర్తుచేస్తుందని స్పష్టం చేసింది.

Similar News

News November 5, 2025

నాకు బతికే అర్హత లేదు అంటూ హీలియం గ్యాస్ పీల్చి..

image

AP: ఇటీవల CA పరీక్షల్లో ఫెయిలైన విశాఖకు చెందిన అఖిల్ వెంకట కృష్ణ (29) అనే విద్యార్థి తల్లిదండ్రులకు భావోద్వేగపూరిత లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘మిమ్మల్ని మోసం చేశా. ఇక నాకు బతికే అర్హత లేదు, క్షమించండి’ అంటూ సూసైడ్ నోట్ రాశాడు. నిన్న రాత్రి తన ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఇతడు గుంటూరులో సీఏ కోచింగ్ తీసుకున్నాడు.

News November 5, 2025

బైకులకు టోల్ ట్యాక్స్ ఎందుకుండదో తెలుసా?

image

నేషనల్ హైవేస్ టోల్ రూల్స్ 2008 రూల్ 4(4) ప్రకారం టూవీలర్స్‌ టోల్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. కార్లు, హెవీ వెహికల్స్‌తో పోలిస్తే బైకులతో రోడ్లు ఎక్కువ డ్యామేజ్ కావు. బండి కొనేటప్పుడే రోడ్ ట్యాక్స్ కడతాం. దానినే పరోక్షంగా రోడ్లు, హైవేల నిర్వహణకు వాడతారు. బైక్‌పై టోల్ ట్యాక్స్ వేస్తే ఆదాయం కంటే.. డబ్బు వసూలు చేయడానికే ఎక్కువ ఖర్చవుతుంది. అంతకు మించి అన్ని టోల్స్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది.

News November 5, 2025

పెరటి కోళ్లు-నాటు కోళ్ల పెంపకం.. ఏది బెస్ట్?

image

వనశ్రీ, రాజశ్రీ కోళ్లు 6 నెలల్లో 2.5- 3 KGల బరువు పెరుగుతాయి. నాటుకోళ్లు ఇదే సమయంలో 1.5 KGల బరువే పెరుగుతాయి. పెరటి కోళ్లు 150 నుంచి 160 రోజుల్లో తొలిసారి గుడ్లు పెడతాయి. నాటుకోళ్లు 200 రోజుల తర్వాతే గుడ్లు పెడతాయి. పెరటి కోళ్లు ఏడాదికి 150-180 గుడ్లు పెడతాయి. నాటుకోళ్లు ఏడాదికి 50- 60 గుడ్లే పెడతాయి. అందుకే పెరటికోళ్ల ఆరోగ్యం, మేతలో జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఆదాయం పొందవచ్చంటున్నారు నిపుణులు.