News March 16, 2024

కలిసొస్తుందా? ఖర్చు పెరుగుతుందా?

image

తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. గతంలో మాదిరి ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగుతాయని అంతా భావించగా.. అనూహ్యంగా ఈసీ మేలో పోలింగ్ తేదీ ప్రకటించింది. ఎన్నికల ప్రచారానికి ఈ గ్యాప్ తమకు కలిసి వస్తోందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రచారం, సభలు, కార్యకర్తలకు వసతి, ఆహారం సహా పలు అంశాల్లో ఖర్చు పెరుగుతుందనే ఆందోళన కూడా వారిలో ఉంది. మే 11 వరకు AP, TSలో ప్రచారం చేసుకోవచ్చు.

Similar News

News August 25, 2025

యాపిల్ ఫోల్డబుల్ ఫోన్‌లో 4 కెమెరాలు!

image

యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయో ‘బ్లూమ్‌బర్గ్’ మార్క్ గుర్మన్ అంచనా వేశారు. ‘ఫ్లిప్ కాకుండా యాపిల్ కంపెనీ ఫోల్డబుల్ ఫోన్ బుక్ స్టైల్లో ఉంటుంది. ఇందులో ఫేస్ ఐడీ కాదు టచ్ ఐడీ ఉంటుంది. సీ2 మోడెమ్, 4 కెమెరాలు ఉంటాయి. కేవలం ఈ-సిమ్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది’ అని తెలిపారు. దీని ధర రూ.1,74,900 వరకు ఉండొచ్చని, 2026లో విడుదలయ్యే అవకాశాలున్నాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

News August 25, 2025

మానవ మృగాలు ఫామ్‌హౌస్‌లో ఉన్నాయి: CM రేవంత్

image

TG: ప్రతిపక్ష నేతలే టార్గెట్‌గా OUలో CM రేవంత్ పరోక్షంగా విమర్శలు చేశారు. ‘సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఏనుగులు ఉన్నాయని అభివృద్ధి కాకుండా అడ్డుకున్నారు. రాష్ట్రంలో ఏనుగులు, సింహాలు లేవు. కేవలం మానవ రూపంలో ఉన్న మృగాలే ఉన్నాయి. అవి కూడా ఫామ్‌హౌజ్‌లో ఉన్నాయి. వాటిని నిర్బంధించడానికి వలలు వేయండి. లేని ఏనుగులు, సింహాలను నేను చంపేస్తున్నానని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు’ అని రేవంత్ మండిపడ్డారు.

News August 25, 2025

ఇష్టారీతిన బిల్డింగులు కట్టొద్దు: నారాయణ

image

AP: గత ప్రభుత్వంలో ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఇష్టమొచ్చినట్లు బిల్డింగ్స్ కట్టారని మంత్రి నారాయణ ఆరోపించారు. ‘ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ ఇప్పటికే ఇచ్చాం. బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీమ్‌పై వర్క్ చేస్తున్నాం. నెలనెలా శాటిలైట్ పిక్చర్స్ స్టడీ చేసి.. ప్లానింగ్‌కి డీవియేషన్ ఉంటే CM చర్యలు తీసుకోమన్నారు. ఎవరైనా సరే డీవియేషన్ లేకుండా భవనాలు కట్టుకోండి. తేడాలుంటే ఇబ్బందులు పడతారు’ అని విజ్ఞప్తి చేశారు.