News March 16, 2024
కలిసొస్తుందా? ఖర్చు పెరుగుతుందా?

తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. గతంలో మాదిరి ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయని అంతా భావించగా.. అనూహ్యంగా ఈసీ మేలో పోలింగ్ తేదీ ప్రకటించింది. ఎన్నికల ప్రచారానికి ఈ గ్యాప్ తమకు కలిసి వస్తోందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రచారం, సభలు, కార్యకర్తలకు వసతి, ఆహారం సహా పలు అంశాల్లో ఖర్చు పెరుగుతుందనే ఆందోళన కూడా వారిలో ఉంది. మే 11 వరకు AP, TSలో ప్రచారం చేసుకోవచ్చు.
Similar News
News February 7, 2026
గుంటూరు: అంబటిపై 36 కేసులు..?

ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 36 కేసులు నమోదైనట్లు సమాచారం. గుంటూరు, బాపట్ల, తూర్పు–పడమర గోదావరి, కర్నూలు, కడప, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు తదితర జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. ఎక్కువ కేసుల్లో ఎఫ్ఐఆర్లు నమోదై ఉన్నాయి. కాగా నల్లపాడు కేసులో ఆయనను అరెస్ట్ చేయగా కోర్టు రిమాండ్ విధించింది. ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నారు.
News February 7, 2026
పోలీసులు మంచివాళ్లు కాబట్టి పద్ధతిగా కేసీఆర్ ఇంటికే వెళ్లారు: CM

TG: ఫోన్ ట్యాపింగ్ చేస్తే నోటీసు ఇవ్వకపోతే ఏం చేస్తారని సీఎం రేవంత్ అన్నారు. ‘తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇచ్చామని కొందరు అంటున్నారు. తప్పు చేస్తే బేడీలు వేసి లాక్కొచ్చే అవకాశం ఉంది. తెలంగాణ పోలీసులు మంచివాళ్లు కాబట్టి పద్ధతిగా కేసీఆర్ ఇంటికే వెళ్లి వాంగ్మూలం తీసుకున్నారు’ అని పరిగి బహిరంగ సభలో తెలిపారు.
News February 7, 2026
రేవంత్ ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి కాలేరు: KTR

TG: రేవంత్ ఎప్పటికైనా BJP మనిషేనని KTR ఎద్దేవా చేశారు. కామారెడ్డి(D) బాన్సువాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రేవంత్ కాంగ్రెస్ నేత కాదు బడే భాయ్ తమ్ముడు. కాంగ్రెస్ నుంచి ప్రయోజనాలు పొందిన వాళ్లే వారికి ఓటేయాలి. తర్వాత మా ప్రభుత్వం వస్తుంది. కచ్చితంగా కాంగ్రెస్ కంటే గొప్పగా అభివృద్ధి చేస్తాం. ఆయన విసిరే ఎంగిలి మెతుకుల కోసం పోచారం కాంగ్రెస్ సంకలో దూరారు’ అని విమర్శించారు.


