News December 29, 2024

నుమాయిష్ ప్రారంభం వాయిదా

image

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జనవరి 1న ప్రారంభం కావాల్సిన నుమాయిష్ వాయిదా పడింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి ప్రభుత్వం 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. దీంతో జనవరి 3వ తేదీన సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 2500 స్టాళ్లు ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 25 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా.

Similar News

News September 24, 2025

అభిషేక్ శర్మ అర్ధ శతకం

image

ఆసియా కప్: బంగ్లాదేశ్‌ బౌలర్లపై అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. కేవలం 25 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నారు. 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ చేశారు. గిల్(29) కూడా అద్భుత ఫామ్‌లో కనిపించినా బౌండరీ వద్ద క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరారు. 8 ఓవర్లకు భారత్ స్కోర్ 83/1. అభిషేక్ శర్మ(50*), దూబే(2*) క్రీజులో ఉన్నారు.

News September 24, 2025

రేపు పలు జిల్లాలకు భారీ వర్షసూచన

image

AP: బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కోస్తాంధ్రలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది. ప.గో., ఏలూరు, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. SKL, VZM, మన్యం, అల్లూరి తదితర జిల్లాల్లో మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది.

News September 24, 2025

మైనింగ్ సెక్టార్‌లో సంస్కరణలు: కిషన్ రెడ్డి

image

TG: మైనింగ్ సెక్టార్‌లో సంస్కరణలను తీసుకొస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ‘ప్రపంచ దేశాలన్నీ క్రిటికల్ మినరల్స్ కోసం పోటీ పడుతున్నాయి. సెల్ ఫోన్ నుంచి స్పేస్ టెక్నాలజీ వరకు , అగ్రికల్చర్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ వరకు వీటికి డిమాండ్ ఉంది. ₹32,000Crతో నేషనల్ మినరల్ క్రిటికల్ మిషన్‌ను ప్రారంభించాం. స్క్రాప్ నుంచి మినరల్స్‌ను తీసే ప్రయత్నం జరుగుతోంది’ అని పేర్కొన్నారు.