News December 29, 2024

6 విమాన ప్ర‌మాదాలు.. 234 మంది మృతి

image

ప్ర‌పంచ ఏవియేష‌న్ రంగానికి డిసెంబర్ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ నెల‌లో పలు దేశాల్లో జరిగిన ప్రమాదాల్లో 234 మంది ప్ర‌యాణికులు మృతి చెందారు. అదివారం ద‌క్షిణ కొరియాలో జ‌రిగిన ఒక్క ఘటనలోనే 177 మంది మృతి చెందారు. అంత‌కుముందు అజర్ బైజాన్ విమానం కజకిస్థాన్‌లో అనుమానాస్ప‌ద రీతిలో ప్ర‌మాదానికి గురైన ఉదంతంలో 38 మంది అసువులు బాశారు. మ‌రో 4 చోట్ల 19 మంది మృతి చెందడం సాంకేతిక సమస్యలపై ఆందోళన కలిగిస్తోంది.

Similar News

News January 8, 2026

ఈడీ రెయిడ్స్.. ఇంతకీ ప్రతీక్ జైన్ ఎవరు?

image

ఐప్యాక్ ఆఫీసు, ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇంటిపై <<18796717>>ED దాడులు<<>> చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రతీక్ జైన్ ఎవరనే చర్చ జరుగుతోంది. IIT బాంబే పూర్వ విద్యార్థి అయిన ప్రతీక్ ఎన్నికల వ్యూహం, డేటా విశ్లేషణలో ఎక్స్‌పర్ట్. I-PAC కోఫౌండర్. 2019 నుంచి TMCతో కలిసి పని చేస్తున్నారు. ఆ పార్టీ IT సెల్ హెడ్‌గానూ ప్రతీక్ కొనసాగుతున్నారు. TMCతోపాటు పలు పార్టీలు, ప్రభుత్వాలకు సలహాదారుగా I-PAC వ్యవహరిస్తోంది.

News January 8, 2026

ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్.. సీఎం సమీక్ష

image

TG: సెంట్రలైజ్డ్ కిచెన్స్ ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని రివ్యూ మీటింగ్‌లో సూచించారు. ‘సోలార్ కిచెన్‌ల ఏర్పాటును పరిశీలించాలి. యంగ్ ఇండియా స్కూళ్ల పనుల్ని వేగవంతం చేయాలి. ఇందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యతనివ్వాలి’ అని చెప్పారు.

News January 8, 2026

ఆన్‌లైన్‌లోనే పొదుపు సంఘాలకు రుణాలు: చంద్రబాబు

image

AP: పొదుపు సంఘాలు ఆన్‌లైన్‌లోనే రుణాలు తీసుకునే సదుపాయం త్వరలో వస్తుందని CM చంద్రబాబు తెలిపారు. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదని చెప్పారు. 1.13 కోట్ల మంది సభ్యులు పొదుపు సంఘాల ద్వారా రూ.26 వేల కోట్ల నిధిని ఏర్పాటు చేశారని అభినందించారు. గుంటూరులో నిర్వహించిన సరస్ మేళాలో ఆయన మాట్లాడారు. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త రావాలని, MSMEలు పెట్టుకోవాలని సూచించారు.