News December 30, 2024
అన్నమయ్య జిల్లా: ప్రమాదంలో భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం

మదనపల్లె బైపాస్లోని రాయల్ ఉడ్ వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కారు టైర్ పంచర్ కావడంతో బైకు, బంకు, చెట్టును ఢీకొట్టింది. గాయాలపాలైన దంపతుల్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు. భార్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. మృతుడు పలమనేరు దాసర్లపల్లికి చెందిన గంగాధర్గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 27, 2025
కడప: నలుగురిని సస్పెండ్ చేసిన కలెక్టర్

భారత ఎన్నికల సంఘం ఆదేశాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నలుగురు పోలింగ్ బూత్ ఆఫీసర్లపై సస్పెన్షన్ వేటు వేసినట్లు కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. ఓటర్ల జాబితాల సర్వేలో విధుల్లో తీవ్ర అలసత్వం వహిస్తున్నట్లు తెలిపారు. భాగంగా సీ.కే దిన్నెలోని తాడిగొట్ల, వల్లూరులోని టీజీ పల్లె, వీరపునాయుని పల్లెలోని అలిదెన, ఎన్. పాలగిరి సచివాలయాల్లో పనిచేస్తున్న BLOలను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
News December 27, 2025
జనవరి 11 లోపు ‘పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి

పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ ప్రక్రియను జనవరి 11వ తేదీ లోపు పూర్తి చేయాలని డైట్ లెక్చరర్ కె.వి.సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం వల్లూరు మండలంలోని ఏపీ మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాలలను ఆయన సందర్శించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా ప్రధాని మోదీతో మాట్లాడే అవకాశం దక్కుతుందని, తద్వారా పరీక్షలను ఆత్మవిశ్వాసంతో రాయగలుగుతారని ఆయన పేర్కొన్నారు.
News December 27, 2025
జనవరి 11 లోపు ‘పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి

పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ ప్రక్రియను జనవరి 11వ తేదీ లోపు పూర్తి చేయాలని డైట్ లెక్చరర్ కె.వి.సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం వల్లూరు మండలంలోని ఏపీ మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాలలను ఆయన సందర్శించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా ప్రధాని మోదీతో మాట్లాడే అవకాశం దక్కుతుందని, తద్వారా పరీక్షలను ఆత్మవిశ్వాసంతో రాయగలుగుతారని ఆయన పేర్కొన్నారు.


