News March 16, 2024

ఏసీలు కొంటున్నారా? తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

image

* రూమ్ సైజుకు తగిన సామర్థ్యం ఉన్న ఏసీ తీసుకోవాలి. 110 sq ft గదికి 1 టన్ను కెపాసిటీ ఉన్న ఏసీ సరిపోతుంది.
* ఇన్వర్టర్‌తో కూడిన ఏసీ కొంటే కరెంటును ఆదా చేస్తుంది.
* స్టెబిలైజర్ కూడా తీసుకోవాలి. ఏసీ పాడవకుండా ఉంటుంది.
* కనీసం ఐదేళ్ల పీసీబీ వారంటీ, పదేళ్ల ఇన్వర్టర్ కంప్రెసర్ వారంటీ ఉన్నవి కొనడం ఉత్తమం.
* ఈ కామర్స్ సంస్థలు, డీలర్ల వద్ద కొనేముందు ధరల మధ్య తేడాను గమనించాలి.

Similar News

News August 28, 2025

అమెరికా టారిఫ్స్.. భారత్ ప్లాన్ ఇదే!

image

అమెరికా 50% టారిఫ్స్ అమల్లోకి రావడంతో భారత్ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. ఎగుమతులను 40 దేశాలకు విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. యూకే, సౌత్ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాలకు డైమండ్స్, టెక్స్‌టైల్, లెదర్, సీ ఫుడ్ సహా ఇతర వస్తువులను ఎగుమతి చేయాలని భావిస్తోంది. భారత వస్తువుల క్వాలిటీ బాగుంటుందని, నమ్మకమైన ఎగుమతిదారు అని విదేశాల్లో విశ్వసనీయత ఉండటంతో దాన్ని వాడుకోవాలని యోచిస్తోంది.

News August 27, 2025

ఈ జిల్లాల్లో రేపు విద్యాసంస్థలకు సెలవు

image

TG: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించారు. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు రేపు సెలవు ఉండనుంది. మిగతా జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. మీ జిల్లాలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.

News August 27, 2025

గోదావరి పరీవాహక ప్రజలు జాగ్రత్త!

image

TG: గోదావరి నదిపై నిజామాబాద్ జిల్లాలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద భారీగా పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అది 4 లక్షల నుంచి 5 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందన్నారు. మంజీరా నది వరద అంతా SRSPలోకి రానుంది. అటు కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సైతం ప్రవాహం పెరగనుంది.