News December 30, 2024
నదిలో పడిన ట్రక్కు.. 71 మంది మృతి

ఇథియోపియాలోని సిదామా ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. నదిలో ట్రక్కు పడిన ఘటనలో 71 మంది మృతిచెందారు. చనిపోయిన వారిలో 68 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల్లో యువకులు ఎక్కువగా ఉన్నట్లు, వారు ఓ వివాహ వేడుకకు హాజరై వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 11, 2025
సౌత్ ఇండియన్ బ్యాంక్లో PO ఉద్యోగాలు

సౌత్ ఇండియన్ బ్యాంక్లో ప్రొబేషనరీ ఆఫీసర్(PO) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. CMA/ICWA అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల 19 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు లేదు. వెబ్సైట్: https://www.southindianbank.bank.in
News November 11, 2025
అరటి ఆకులో భోజనం చేస్తే ఇన్ని ప్రయోజనాలా?

శుభకార్యాల సమయంలో చాలా మంది అరటి ఆకులో భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఇది సంప్రదాయమే కాక ఆరోగ్యపరంగానూ ప్రయోజనకరమని వైద్యులు చెబుతున్నారు. అరటి ఆకులో ఉన్న పాలీఫినాల్స్ & యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఆహారంలో హానికరమైన బ్యాక్టీరియా పెరగకుండా నిరోధిస్తాయంటున్నారు. అలాగే ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని, సహజ రుచిని ఆస్వాదించవచ్చని పేర్కొంటున్నారు.
News November 11, 2025
వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు పారిపోయారు: సీఎం

AP: సంక్షేమం, అభివృద్ధిలో ఏపీ బ్రాండ్ను మళ్లీ తీసుకొస్తున్నామని CM చంద్రబాబు చెప్పారు. ప్రతి ఇంట్లో ఓ పారిశ్రామికవేత్త ఉండాలనేది తమ లక్ష్యమన్నారు. ప్రకాశం(D) కనిగిరిలో MSMEల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘YCP పాలనలో బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు పారిపోయారు. మా హయాంలో పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి 50కి.మీలకు ఒక పోర్టు నిర్మిస్తాం’ అని పేర్కొన్నారు.


