News December 30, 2024

అల్లు అర్జున్ కేసు.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

image

AP: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ CM పవన్ మీడియా చిట్‌చాట్‌లో స్పందించారు. ‘గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చారు. అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలి. మానవతా దృక్పథం లోపించినట్లైంది. బన్నీనే కాదు. టీమ్ అయినా స్పందించాల్సింది. CM రేవంత్ పేరు చెప్పలేదని అరెస్ట్ చేశారనడం సరికాదు. బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలానే చేస్తారు’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం.

Similar News

News November 2, 2025

రాజకీయ హింస.. ఏడాదిలో 281 మంది మృతి

image

విద్యార్థుల ఆందోళనలతో బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా అధికారం కోల్పోయినప్పటికీ పొలిటికల్ వయలెన్స్ కొనసాగుతూనే ఉంది. గత ఏడాది AUG నుంచి ఈ ఏడాది SEP వరకు అల్లర్లలో 281 మంది మరణించారని మానవ హక్కుల సంఘం వెల్లడించింది. అలాగే అక్రమ నేరారోపణలతో 40 మంది చట్టవిరుద్ధ హత్యలకు గురయ్యారని తెలిపింది. మరో 153 మందిని దారుణంగా ఉరితీశారని పేర్కొంది. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు జవాబుదారీగా ఉండటం లేదని అభిప్రాయపడింది.

News November 2, 2025

పంకజ్ త్రిపాఠి తల్లి కన్నుమూత

image

బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి హేమ్వంతి దేవి(89) అనారోగ్యంతో రెండు రోజుల కిందట మరణించారు. బిహార్‌లోని స్వస్థలం గోపాల్‌గంజ్‌లో నిన్న అంత్యక్రియలు కూడా పూర్తయినట్లు నటుడి టీమ్ ఇవాళ ప్రకటించింది. త్రిపాఠి తండ్రి బెనారస్ తివారీ(99) రెండేళ్ల క్రితం చనిపోయారు. మీర్జాపూర్ వెబ్ సిరీస్ ద్వారా పంకజ్ తెలుగు వారికీ దగ్గరైన విషయం తెలిసిందే.

News November 2, 2025

తుఫాను: రైతులను పరామర్శించనున్న జగన్

image

AP: మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను తమ అధినేత జగన్ పరామర్శిస్తారని వైసీపీ తెలిపింది. ఈ నెల 4న కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరులో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారని పేర్కొంది. కాగా జగన్ ఇవాళ బెంగళూరు నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి వచ్చారు.