News March 16, 2024
NLR: తొలిసారి ఎమ్మెల్యేలుగా నలుగురి పోటీ

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నలుగురు వైసీపీ అభ్యర్థులు తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఉదయగిరి నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, వెంకటగిరి నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, గూడూరు నుంచి మేరిగ మురళీధర్, నెల్లూరు నగరం నుంచి ఖలీల్ అహ్మద్ ఈ జాబితాలో ఉన్నారు. ఆదాల, రామిరెడ్డి నాలుగో సారి, కిలివేటి, కాకాణి మూడో సారి, మేకపాటి విక్రమ్ రెడ్డి రెండో సారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు.
Similar News
News October 31, 2025
నెల్లూరు జిల్లాలోని ఇళ్లపై విచారణ: మంత్రి

నెల్లూరు జిల్లాలో గత ప్రభుత్వం నాసిరకం ఇళ్లను కట్టిందని గృహనిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నెల్లూరులోని టీడీపీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ.. ఓ కాంట్రాక్ట్ సంస్థ ఈ ఇళ్లను నిర్మించిందన్నారు. వారిపై విజిలెన్స్ విచారణ చేయిస్తామని.. నగదు రికవరీ చేయడమా? క్రిమినల్ కేసులు పెట్టడమా? అనేది త్వరలో చెబుతామన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరు చేస్తామన్నారు.
News October 31, 2025
నెల్లూరు: ఇండోసోల్ అంశంపై హైకోర్ట్ మొట్టికాయలు

ఇండోసోల్ పరిశ్రమకు చెరువుల్లోని మంచినీటిని ఎలా ఇస్తారంటూ హైకోర్టు ధర్మాసనం శుక్రవారం ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా చెరువుల్లోని తాగునీటిని ఇండోసోల్ పరిశ్రమకు తరలిస్తున్నారంటూ గుడ్లూరు(M) చేవూరు, కావలి(M) చెన్నాయపాలెం ప్రజలు హైకోర్టులో పిల్ వేశారు. దానిపై విచారించిన ధర్మాసనం సమగ్ర నివేదిక ఇవ్వాలని నెల్లూరు(D) కలెక్టర్ను ఆదేశించింది.
News October 31, 2025
వెంకటగిరి: బాలికపై లైంగిక దాడి.. మారుతండ్రికి జీవిత ఖైదు

బాలికపై మారు తండ్రి పలుమార్లు లైంగిక దాడి కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడు సర్వేపల్లి అంజయ్యకు జీవిత ఖైదుతో పాటు రూ.40 వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. వెంకటగిరి బంగారు పేట అరుంధతి పాలేనికి చెందిన సర్వేపల్లి అంజయ్యకు ఓ వివాహితతో పరిచయం ఏర్పండి. ఈ క్రమంలో ఆమెతో ఉంటూ మహిళ 15 ఏళ్ల కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి 2021 జులై 19న కేసు నమోదైంది.


