News March 16, 2024

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. ఏడుగురు జవాన్ల మృతి

image

పాకిస్థాన్‌లోని నార్త్ వజిరిస్థాన్ సెక్యూరిటీ చెక్‌పోస్టుపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు ఆర్మీ అధికారులతోపాటు ఆరుగురు టెర్రరిస్టులు మరణించారు. టెర్రరిస్టులు పేలుడు సామగ్రితో కూడిన వాహనంతో వచ్చి చెక్‌పోస్టును ఢీకొట్టి పేల్చేశారు. తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించగా సైనికులు కాల్చేశారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News April 2, 2025

వక్ఫ్ బిల్లుపై అపోహలు సృష్టిస్తున్నారు: అమిత్‌షా

image

వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగబద్ధమేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. కొన్ని పార్టీలు మైనార్టీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నాయని ఆరోపించారు. వక్ఫ్ బిల్లుపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఈ బిల్లుకు మెజార్టీ వర్గాల మద్దతు ఉందని, ఇది తాము చేపట్టిన అతిపెద్ద సంస్కరణ అని లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చలో షా పేర్కొన్నారు.

News April 2, 2025

కొడాలి నాని హెల్త్ UPDATE

image

AP: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానికి హార్ట్ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆపరేషన్ కోసం ముంబై వెళ్లారు. అక్కడి ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ వైద్యులు ఆయనకు బైపాస్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న నాని కొద్దిరోజుల్లోనే డిశ్చార్జ్ కానున్నారు.

News April 2, 2025

సుంకాల ప్రభావం.. భారత్‌లో తగ్గనున్న బంగారం ధరలు!

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించనున్న సుంకాలతో భారత్‌లో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. $11.88 బిలియన్ల విలువైన బంగారం, వెండి, వజ్రాలను భారత్ అమెరికాకు ఎగుమతి చేస్తుండగా వీటిపై ట్రంప్ 13.3% సుంకం విధించనున్నారు. దీని ప్రభావంతో భారత్‌లో నగలు, ఖరీదైన ఆభరణాలు చౌక కానున్నట్లు తెలుస్తోంది. కాగా, ఎలక్ట్రానిక్ పరికరాలపై సుంకం పెరగడంతో మొబైల్ ధరలు పెరిగే అవకాశం ఉంది.

error: Content is protected !!