News March 16, 2024
లెఫ్ట్ పార్టీలకు ఈ ఎన్నికలు చావోరేవో! – 1/2

ఎన్నికల నగారా మోగింది. బీజేపీ 400 సీట్లు టార్గెట్ పెట్టుకుంటే, ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకుంది. ఇందులో భాగమైన లెఫ్ట్ పార్టీలకు మాత్రం ఈ ఎన్నికలు కత్తిమీద సాములా మారాయి. సీపీఐ-3, సీపీఎం-2తో గత ఎన్నికల్లో ఐదు సీట్లకే పరిమితమైన లెఫ్ట్ పార్టీల ఉనికి ఇప్పుడు అంతంతమాత్రంగానే ఉంది. ఈసారి తేడా వస్తే అది కూడా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందంటున్నారు విశ్లేషకులు.
Similar News
News September 9, 2025
ఎంపీలతో సీఎం రేవంత్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్

ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. సరైన విధంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దన్నారు. మరోవైపు ఎన్నికల్లో ఓటు వేసేందుకు విజయనగరం టీడీపీ ఎంపీ అప్పలనాయుడు సైకిల్పై పార్లమెంట్కు వెళ్లారు.
News September 9, 2025
పిల్లలకు ఐఐటీ ఫౌండేషన్ క్లాసులు.. సైకాలజిస్టు ఏమన్నారంటే?

పిల్లలను IIT ఫౌండేషన్ కోర్సుల్లో చేర్పిస్తూ కొందరు ఇబ్బంది పెడుతుంటారు. అయితే ఇలా చేయడం కరెక్ట్ కాదని సైకాలజిస్ట్ శ్రీకాంత్ పేర్కొన్నారు. ‘పిల్లల మెదడు/మనసు కొన్ని విషయాలని ఓ వయసు వచ్చేవరకూ అర్థం చేసుకోలేవు. దీన్ని సైకాలజిస్టు జీన్ పియాజే చాలా ఏళ్ల క్రితం అధ్యయన పూర్వకంగా నిరూపించారు. దానికి తగ్గట్లే బడిలో మన పాఠ్యాంశాలుంటాయి. ఇప్పుడు నువ్వు ఐదో తరగతిలో ఐఐటీ అంటే వెధవ ఎవడిక్కడ?’ అని విమర్శించారు.
News September 9, 2025
RECORD: తొలిసారి రూ.లక్ష దాటిన 22 క్యారెట్ గోల్డ్ రేటు

బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీంతో చరిత్రలో తొలిసారి 24 క్యారెట్ల బంగారం రూ.1.10లక్షలు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.లక్ష దాటింది. HYD బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10g పసిడి ధర రూ.1,360 పెరిగి రూ.1,10,290కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10g గోల్డ్ రూ.1250 ఎగబాకి రూ.1,01,100 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,40,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.