News December 31, 2024
టీచర్గా మారిన ఎమ్మెల్యే బండారు శ్రావణి

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ను శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ సోమవారం తనిఖీ చేశారు. అనంతరం కాసేపు టీచర్గా మారి విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. పాఠశాలలోని సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. క్రమశిక్షణతో చదువుకోవాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల సిబ్బందకి పలు సూచనలు చేశారు.
Similar News
News December 31, 2025
అనంతపురంలో ‘అనంత పాల ధార’ అవగాహన కార్యక్రమం

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అనంత పాల ధార అవగాహన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు జేడీ ప్రేమ్ చంద్ తెలిపారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. జనవరి 7, 8, 9 తేదీల్లో పశు పోషకులకు పాల దిగుబడి పోటీలు నిర్వహిస్తున్నామని వివరించారు. వెటర్నరీ వైద్యులు ఈ పోటీలపై తమ పరిధిలోని రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ పోటీలతో పశుగ్రాసం, పాల ఉత్పత్తి పెంపుపై రైతులకు అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు.
News December 31, 2025
శిల్పారామంలో పార్కింగ్కు వేలం పాట

అనంతపురం శిల్పారామంలో 2026 జనవరి 1 నుంచి పార్కింగ్ యాక్టివిటీ నిర్వహణకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు. ఈ టెండర్ ప్రక్రియ డిసెంబర్ 31, 2025న మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య శిల్పారామం పరిపాలన అధికారి కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఆసక్తిగలవారు 88866 52051, 63090 29590 నంబర్లకు సంప్రదించాలని పరిపాలన అధికారి శివప్రసాద్ రెడ్డి వివరించారు.
News December 31, 2025
శిల్పారామంలో పార్కింగ్కు వేలం పాట

అనంతపురం శిల్పారామంలో 2026 జనవరి 1 నుంచి పార్కింగ్ యాక్టివిటీ నిర్వహణకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు. ఈ టెండర్ ప్రక్రియ డిసెంబర్ 31, 2025న మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య శిల్పారామం పరిపాలన అధికారి కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఆసక్తిగలవారు 88866 52051, 63090 29590 నంబర్లకు సంప్రదించాలని పరిపాలన అధికారి శివప్రసాద్ రెడ్డి వివరించారు.


