News December 31, 2024

కొరిశపాడు: రోడ్డు మిల్లర్ ఢీకొని బాలుడి మృతి

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా కొరిశపాడులో సోమవారం విషాద ఘటన జరిగింది. స్థానిక జగజ్జీవన్ రావ్ కాలనీకి చెందిన దుడ్డు నాగయ్య కుమారుడు గౌతమ్ తన తాతతో కలిసి బైకుపై సెంటర్లో ఉన్న బొడ్డురాయి దగ్గరికి వెళ్లాడు. ఇద్దరు బైక్‌పై కూర్చొని ఉండగా రోడ్లు వేస్తున్న మిల్లర్ రివర్స్‌లో వచ్చి బైకును ఢీకొట్టింది. బాలుడికి బలమైన దెబ్బ తగలడంతో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Similar News

News October 31, 2025

ప్రకాశం జిల్లాలో నేడు పాఠశాలలు పునః ప్రారంభం

image

తుఫాన్ ప్రభావం తగ్గడంతో నేటి నుంచి యధావిధిగా పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. వరుసగా 4 రోజులు తుఫాను సెలవుల అనంతరం నేడు బడిగంట మోగనుంది. ఈ దశలో విద్యార్థుల భద్రతకోసం ఉపాధ్యాయులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని DEO కిరణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల పరిసరాల్లో చెట్ల కొమ్మలు, కరెంట్ వైర్లు, తడిసిన గోడలు వంటి అంశాలను పరిశీలించి విద్యార్థుల పట్ల జాగ్రత్త వహించాలని ఆయన కోరారు.

News October 31, 2025

ప్రకాశం: ‘ఆక్వా రైతుల కంటతడి’

image

ప్రకాశం జిల్లా తీర ప్రాంతాన్ని నమ్ముకుని వేలమంది ఆక్వా రైతులు జీవిస్తున్నారు. సింగరాయకొండ, టంగుటూరు, కొత్తపట్నం, నాగులుప్పపాడు మండలాల్లో ఆక్వా సాగు చేసిన రైతులు మొంథా తుఫాను దాటికి దెబ్బతిన్నారు. అదిక వర్షాలతో వల్ల కరెంట్ కోతలతోపాటు, చెరువుల్లో ఉప్పు నీటిశాతం తగ్గడంతో రొయ్యలు సరిగా మేత తినక డల్లయ్యాయి. తుఫానుకు ముందే అమెరికా సుంకాలతో ఆక్వా రైతులు కుదేలు కాగా మొంథా తుఫాన్ మరింత చిక్కులు తెచ్చింది.

News October 30, 2025

31న ఒంగోలులో జాబ్ మేళా.. జీతం రూ.23 వేలు

image

ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 31వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. ఈ మేరకు ఆమె గురువారం ప్రకటన విడుదల చేశారు. పెద్ద స్థాయిలో కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని, 10 నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. ఎంపికైన వారికి రూ.14 వేల నుంచి రూ.23 వేల వరకు జీతం లభించే అవకాశం ఉందని, 18 నుంచి 30 ఏళ్ల వయసు కలవారు పాల్గొనాలని సూచించారు.