News December 31, 2024

విమానంలో ఏ సీటు సేఫ్?

image

ఇటీవల తరచూ విమాన ప్రమాదాలు జరుగుతుండటంతో ఫ్లైట్స్‌లో ఏ సీట్లు సేఫ్ అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రెక్కల కిందిభాగంలో ఇంధనం ఉండటం వల్ల నిప్పులు రాజుకుంటే వాటి పక్కన కూర్చున్న వారికి ప్రభావం ఎక్కువని, తోక భాగం సేఫ్ అని నిపుణులు అంటున్నారు. మంటలు లేకపోయినా ముందు కూర్చున్నవారికి ముప్పు ఎక్కువట. మధ్య సీట్ల పరిస్థితి విచిత్రమని, నిప్పు లేకపోతే EMG ఎగ్జిట్ వీరికి దగ్గరగా ఉండటంతో తప్పించుకునే అవకాశముంది.

Similar News

News July 7, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 7, 2025

GILL: ప్రపంచంలో ఒకే ఒక్కడు

image

టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండో టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీలతో రికార్డుల మోత మోగించారు. ఫస్ట్ క్లాస్ మ్యాచులో 400+, లిస్ట్ ఏ మ్యాచులో 200+, టీ20 మ్యాచులో 100+, వన్డేలో 200+, టెస్టులో 400+ రన్స్ కొట్టిన ఏకైక ప్లేయర్‌గా నిలిచారు. ప్రపంచంలో మరే ఆటగాడికి ఈ ఘనత సాధ్యం కాలేదు. కాగా రెండో టెస్టు మ్యాచులో గిల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

News July 7, 2025

పహల్గామ్‌లో మానవత్వంపై దాడి జరిగింది: మోదీ

image

17వ BRICS సదస్సులో ‘శాంతి-భద్రత, రిఫార్మ్ ఆఫ్ గ్లోబల్ గవర్నెన్స్’ అనే అంశంపై జరిగిన చర్చలో.. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు ఒక్కటిగా పోరాడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ‘పహల్గామ్‌లో మానవత్వంపై దాడి జరిగింది. ఇప్పుడు మానవాళి ఎదుర్కొంటున్న కఠినమైన సవాళ్లలో ఉగ్రవాదం ఒకటి. ఉగ్రవాదుల్ని ఏ దేశం ప్రోత్సహించినా మూల్యం చెల్లించేలా చేయాలి. బాధితుల్ని, ఉగ్రవాదుల్ని ఒకే త్రాసులో ఉంచలేం’ అని మోదీ పేర్కొన్నారు.