News March 16, 2024

జగన్, చంద్రబాబు ఢిల్లీలో మోదీ పక్కనే: సీఎం రేవంత్

image

ఏపీలో పాలకులు ఢిల్లీలో గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. విశాఖలో మాట్లాడుతూ.. ‘ఇక్కడి 25 ఎంపీ స్థానాలు మోదీ ఖాతాలోనే ఉంటాయి. జగన్, చంద్రబాబు రాష్ట్రంలో వేర్వేరుగా ఉన్నా.. ఢిల్లీలో మోదీ పక్కనే ఉంటారు. వారిద్దరూ పాలించాలనుకుంటున్నారు గానీ ప్రశ్నించాలనుకోవట్లేదు. ఈ ప్రాంత సమస్యల మీద పోరాడే నాయకులు కావాలి’ అని పేర్కొన్నారు.

Similar News

News September 10, 2025

తురకపాలెం వరుస మరణాలపై అధ్యయనం: సత్యకుమార్

image

AP: గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించి కారణాలు తెలుసుకుంటామన్నారు. ‘ఐసీఏఆర్ టీమ్ ఇక్కడ పర్యటించింది. ఇప్పటికే మట్టి, తాగునీటి శాంపిల్స్ సేకరించింది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదిక ఇవాళ వస్తుంది. అలాగే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ టీమ్ కూడా గుంటూరుకు వస్తోంది’ అని ఆయన తెలిపారు.

News September 10, 2025

ఉద్యాన మొక్కల్లో ఇనుము లోప లక్షణాలు – నివారణ

image

నేలల్లో సున్నం అధికంగా ఉన్నప్పుడు, సాగునీటిలో బైకార్పోనేట్లు, కార్బోనేట్లు ఎక్కువైనప్పుడు ఉద్యాన మొక్కల్లో ఇనుము లోపం కనిపిస్తుంది. లేత ఆకుల్లో ఈనెలు ఆకుపచ్చగా ఉండి మిగిలిన భాగం పసుపుగా మారుతుంది. క్రమేణా ఆకు పాలిపోయి కాయలు, పిందెలు రాలిపోతాయి. 1 శాతం అన్నభేది ద్రావణాన్ని(10 గ్రా. అన్నభేది+ 5గ్రా. నిమ్మ ఉప్పు) లీటరు నీటికి కలిపి లక్షణాలు తగ్గేవరకు వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.

News September 10, 2025

విజయవాడలోని సీపెట్‌లో ఉద్యోగాలు

image

విజయవాడలోని <>సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్<<>> ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిని తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనుంది. ప్లాస్టిక్ ఇంజినీరింగ్&టెక్నాలజీ, మెకానికల్/ప్రొడక్షన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, అసిస్టెంట్ ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్ పోస్టులు ఉన్నాయి. అప్లైకి SEP 28 ఆఖరు తేదీ.