News December 31, 2024

కాంగ్రెస్ పాలనలో పెరిగిన అత్యాచారాలు: BRS

image

TG: రాష్ట్రంలో ఏడాది కాలంలో క్రైమ్ రేట్ పెరిగిందని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. కాంగ్రెస్ పాలనలో మహిళలపై అత్యాచారాలు ఏడాదిలోనే 28.94శాతం పెరిగాయని పేర్కొంది. సంఘటనలపై పోలీస్ రెస్పాన్స్ టైమ్ తగ్గిందని తెలిపింది. రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నాడా? అని ప్రశ్నించింది. డబ్బు సంచుల కోసం మూసీ ప్రాజెక్టుపై సమీక్ష చేసే సీఎం రేవంత్‌కు ఆడబిడ్డలపై పెరిగిన నేరాలపై సమీక్షలు చేయట్లేదని దుయ్యబట్టింది.

Similar News

News January 19, 2026

మున్సిపల్ ఎన్నికలు.. మంత్రులకు ఇన్‌ఛార్జ్‌ల బాధ్యతలు

image

TG: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రులను లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జ్‌లుగా CM రేవంత్ నియమించారు. NZB-ఉత్తమ్, మల్కాజిగిరి-కోమటిరెడ్డి, KNR-తుమ్మల, నల్గొండ-అడ్లూరి లక్ష్మణ్, WGL-పొంగులేటి, చేవెళ్ల-శ్రీధర్ బాబు, KMM-సురేఖ, మహబూబాబాద్-పొన్నం, MBNR-దామోదర, జహీరాబాద్-అజహరుద్దీన్, MDK-వివేక్, నాగర్ కర్నూల్-వాకిటి శ్రీహరి, భువనగిరి-సీతక్క, PDPL-జూపల్లి, ADB-సుదర్శన్ రెడ్డి(ప్రభుత్వ సలహాదారు)

News January 19, 2026

మీరు చేస్తేనే పిల్లలు నేర్చుకుంటారు

image

కొందరు తల్లిదండ్రులు మా పిల్లలకు ఏం చెబుతున్నా చెయ్యట్లేదు. మాట వినట్లేదు అని బాధపడుతుంటారు. కానీ పెద్దలను చూసే పిల్లలు ఏదైనా పాటిస్తారంటున్నారు నిపుణులు. మనం తీసుకొనే ఆహారం నుంచి వ్యాయామం వరకు వాళ్లు చూసే నేర్చుకుంటారు. సానుకూలంగా ఆలోచించడం, క్లిష్టపరిస్థితుల్లో ధైర్యంగా ఉండటం పేరెంట్స్‌ని చూసే నేర్చుకుంటారు. అలాగే వారి మాటలను శ్రద్ధగా వింటేనే తమ మనసులోని మాటలు స్వేచ్ఛగా పంచుకోగలుగుతారు.

News January 19, 2026

పండ్లు Vs పండ్ల రసాలు.. ఏవి బెటర్?

image

పండ్ల రసం తాగడం కంటే నేరుగా పండ్లను తినడమే చాలా ఉత్తమమని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. ‘ఫ్రూట్స్‌లో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. కానీ పండ్ల రసంలో పీచుపదార్థాలు ఎక్కువగా తొలగిపోతాయి. దీంతో చక్కెర స్థాయులు వేగంగా పెరుగుతాయి. డయాబెటిస్, PCOD, ఒబెసిటీ, గుండె వ్యాధులు ఉన్న వారికి జ్యూస్ మంచిది కాదు’ అని చెబుతున్నారు.