News December 31, 2024
కాంగ్రెస్ పాలనలో పెరిగిన అత్యాచారాలు: BRS

TG: రాష్ట్రంలో ఏడాది కాలంలో క్రైమ్ రేట్ పెరిగిందని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. కాంగ్రెస్ పాలనలో మహిళలపై అత్యాచారాలు ఏడాదిలోనే 28.94శాతం పెరిగాయని పేర్కొంది. సంఘటనలపై పోలీస్ రెస్పాన్స్ టైమ్ తగ్గిందని తెలిపింది. రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నాడా? అని ప్రశ్నించింది. డబ్బు సంచుల కోసం మూసీ ప్రాజెక్టుపై సమీక్ష చేసే సీఎం రేవంత్కు ఆడబిడ్డలపై పెరిగిన నేరాలపై సమీక్షలు చేయట్లేదని దుయ్యబట్టింది.
Similar News
News October 25, 2025
కర్నూలు బస్సు ప్రమాదం.. సోనూసూద్ రిక్వెస్ట్

కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో నటుడు సోనూసూద్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఓ విజ్ఞప్తి చేశారు. ‘ప్రతి లగ్జరీ బస్సులో ఎమర్జెన్సీ డోర్ ఎలక్ట్రానిక్ కాకుండా మాన్యువల్ది పెట్టాలి. ఆపరేటర్లకు నెల సమయం ఇవ్వండి. పర్మిట్ రెన్యూవల్ సమయంలో ఆపరేటర్లు డోర్ మార్చినట్లు ఫొటోలు అప్లోడ్ చేయాలని చెప్పండి. నితిన్ గడ్కరీ సార్ చర్యలు తీసుకోండి. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడకండి’ అని ట్వీట్ చేశారు.
News October 25, 2025
డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉద్యోగాలు

<
News October 25, 2025
మహిళా క్రికెటర్లను అసభ్యంగా తాకిన వ్యక్తి అరెస్ట్

ఉమెన్స్ వరల్డ్ కప్లో SAతో మ్యాచ్ కోసం ఇండోర్(MP)కు వెళ్లిన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. నిన్న హోటల్ నుంచి కేఫ్కు నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు ప్లేయర్లను బైక్పై వచ్చిన ఆకతాయి అసభ్యంగా తాకి పారిపోయాడు. వారు జట్టు మేనేజ్మెంట్కు విషయం చెప్పగా సెక్యూరిటీ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు అకీల్ ఖాన్ను అరెస్ట్ చేశారు.


