News March 16, 2024
శ్రీకాకుళం: ఎన్నికల కంట్రోల్ రూమ్ ఏర్పాటు
సాధారణ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసినందున నేటి నుంచి నూతన కలెక్టర్ కార్యాలయం స్పందన భవనంలో కంట్రోల్ రూమ్ను కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్లో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ విభాగం, సోషల్ మీడియా విభాగము, ఫిర్యాదుల పరిశీలన విభాగం, 24X7 ఫిర్యాదులు స్వీకరణ విభాగానికి టోల్ ఫ్రీ నెంబర్ 18004256625 ఏర్పాటు చేశారు.
Similar News
News September 29, 2024
షూటింగ్ పోటీల్లో టెక్కలి విద్యార్థిని ప్రతిభ
సౌత్ జోన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో టెక్కలి మండలం తిర్లంగి గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థిని వజ్జ ప్రణవి ప్రతిభ కనబరిచింది. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు జరిగిన సీబీఎస్ఈ అండర్-14 షూటింగ్ పోటీల్లో వెండి పథకం సాధించింది. ఎయిర్ రైఫిల్ లో 400 షూట్లకు గాను 391 పాయింట్లు సాధించింది. అక్టోబర్ 21 నుంచి 25 వరకు భోపాల్ లో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది.
News September 29, 2024
శ్రీకాకుళం: భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు
దసరా పండగ ముంగిట నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి. నూనె లీటర్ పై రూ.20-45 వరకు, వెల్లుల్లి కిలో రూ.300 నుంచి రూ.360, అల్లం రూ.100 నుంచి రూ.150, ఎండుమిర్చి రూ.200 నుంచి రూ.240, పెసరపప్పు రూ.150, మినపప్పు రూ.135, కందిపప్పు రూ.150 నుంచి 175కు పెరిగాయి. ఉల్లి కేజీ రూ.60కి తగ్గడం లేదు. ధరలు భారీగా పెరగడంతో ఏదీ కొనలేక పోతున్నామని ప్రజలు అంటున్నారు.
News September 29, 2024
శ్రీకాకుళం జిల్లాలో భారీగా సీఐలు బదిలీ
విశాఖ రేంజ్లో 14 మంది సీఐలుకు శనివారం రాత్రి బదిలీలు జరిగాయి. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాకు ఐదుగురు సీఐలు రానున్నారు. పాతపట్నం సీఐ నల్లి సాయిని విశాఖ వీఆర్కు బదిలీ చేస్తూ డీఐజీ గోపీనాథ్ జట్టి ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ రేంజ్ లో ఉన్న సీఐలు..శ్రీనివాసరావు(డీసీఆర్బీ), కృష్ణారావు (టాస్క్ ఫోర్స్), సూర్యచంద్రమౌళి (సీసీఎస్), ఎం.కృష్ణమూర్తి (డీటీసీ), వానపల్లి రామారావు (పాతపట్నం) స్థానాలకు వస్తున్నారు.