News March 16, 2024
ఆటగాళ్ల పాస్పోర్ట్స్ తీసుకున్న ఐపీఎల్ జట్లు?

ఎలక్షన్స్ దృష్ట్యా ఐపీఎల్ రెండో దశ మ్యాచులను దుబాయ్లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా జట్ల యాజమాన్యాలు తమ ఆటగాళ్ల పాస్పోర్టుల్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆఖరి నిమిషంలో ఏమైనా మార్పులుంటే ఈ చర్య ఉపకరిస్తుందని వారు భావిస్తున్నట్లు సమాచారం. డిఫెండింగ్ ఛాంపియన్స్ సీఎస్కే, ఆర్సీబీ మధ్య మ్యాచ్తో ఈ 22న ఐపీఎల్ మొదలుకానుంది.
Similar News
News April 5, 2025
SBI PO ఫలితాలు విడుదల

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI PO ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది. గత నెల 8, 16, 24, 26 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, DOB, క్యాప్చా ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాల కోసం ఇక్కడ <
News April 5, 2025
శ్రీరామ నవమి వేడుకకు అయోధ్య సిద్ధం

శ్రీ రామ నవమి వేడుకకు అయోధ్య రామ మందిరం ముస్తాబైంది. ఎండల నేపథ్యంలో ప్రత్యేక వసతి కేంద్రాలు నిర్మించినట్లు అధికారులు తెలిపారు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక మార్గాలలో వాహనాలను పంపిస్తున్నారు. శ్రీరామ నవమి వేడుకలను భక్తులందరూ తిలకించేలా భారీ LED స్ర్కీన్లు సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
News April 5, 2025
బతికుండగానే మరణాన్ని ప్రకటించుకున్న యువకుడు!

ఉద్యోగ వేటలో ఎన్నో అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఓ యువకుడు తీసుకున్న నిర్ణయం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. బెంగళూరుకు చెందిన ప్రశాంత్ హరిదాస్ మూడేళ్లుగా ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో చనిపోయినట్లు సంస్మరణ ఫొటోను లింక్డిన్లో పోస్ట్ చేశాడు. అందులో తాను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను వివరించగా.. చాలా మంది ఉద్యోగ అవకాశాల గురించి కామెంట్స్ చేస్తూ అతనికి మద్దతుగా నిలిచారు.