News March 16, 2024

రూ.50 వేలకు మించి నగదుతో ప్రయాణించవద్దు: ఎస్పీ

image

ఎన్నికల దృష్ట్యా ప్రజలు ఆధారాలు లేకుండా రూ.50 వేలకు మించి నగదుతో ప్రయాణించవద్దని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సిరిసిల్ల జిల్లాలో 7 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతిరోజు తనిఖీలలో జప్తు చేసిన సొమ్మును జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీకి అప్పగిస్తామన్నారు. ఆధారాలు ఇస్తే గ్రీవెన్స్ కమిటీ నగదు విడుదల చేస్తుందన్నారు.

Similar News

News October 23, 2025

చొప్పదండి పట్టణ అభివృద్ధికి రూ.15 కోట్లు మంజూరు

image

చొప్పదండి పట్టణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విజ్ఞప్తి మేరకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఈ నిధులు మంజూరు చేశారని ఆయన పేర్కొన్నారు. ఇందుకు చొప్పదండి పట్టణ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధులతో చొప్పదండి మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

News October 23, 2025

సైకిల్ ర్యాలీ పోస్టర్, రూట్ మ్యాప్ ఆవిష్కరించిన KNR సీపీ

image

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న 20 కి.మీ సైకిల్ ర్యాలీ పోస్టర్‌, రూట్ మ్యాప్‌ను సీపీ గౌస్ ఆలం కమిషనరేట్‌లో ఆవిష్కరించారు. 25న ఉదయం ఈ ర్యాలీ పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమై, 20 కి.మీ ప్రయాణించి, తిరిగి అక్కడే ముగుస్తుందని తెలిపారు. ఈ సైక్లింగ్ ర్యాలీలో ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సీపీ పిలుపునిచ్చారు.

News October 23, 2025

ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కనుకులగిద్ద యువకుడు

image

హుజురాబాద్ మండలం కనుకులగిద్దకి చెందిన మొగిలిచర్ల కిషోర్ 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. గ్రామానికి వన్నె తెచ్చిన కిషోర్‌ను కనుకులగిద్ద డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో సన్మానించారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అకుంటిత దీక్షతో 5 ఉద్యోగాలు సాధించిన కిషోర్ గ్రామానికే గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. కిషోర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని గ్రామ యువతకు సూచించారు.