News January 1, 2025
కేరళ నర్సుకు యెమెన్లో ఉరిశిక్ష

కేరళకు చెందిన నిమిష ప్రియ అనే నర్సు 2011లో భర్తతో కలిసి యెమెన్లో స్థిరపడ్డారు. ఆదిబ్ మెహదీ అనే స్థానికుడిని భాగస్వామిగా చేసుకుని క్లినిక్ ప్రారంభించారు. భర్త స్వదేశానికి వచ్చిన సమయంలో మెహదీ ఆమెను లైంగికంగా వేధించాడు. దీంతో ఆమె మత్తు మందు ఇవ్వగా, డోసు ఎక్కువై అతడు మరణించాడు. ఈ కేసు విషయంలో 2017 నుంచి ప్రియ యెమెన్ జైల్లోనే ఉన్నారు. తాజాగా ఆ దేశాధ్యక్షుడు ఆమెకు మరణశిక్ష ఖరారు చేశారు.
Similar News
News February 18, 2026
ఆయుష్ మంత్రిత్వశాఖలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

న్యూఢిల్లీలోని <
News February 18, 2026
ఫాల్గుణ మాసంలో ఇలా చేయండి: పండితులు

మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మాసం ఫాల్గుణం. ఈ నెలలో లక్ష్మీనారాయణులను భక్తితో కొలిస్తే శుభాలు కలుగుతాయని పండితుల మాట. ‘చంద్రుడు ఫల్గుణి నక్షత్రం సమీపంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరొచ్చింది. అర్జునుడికి ‘ఫల్గుణుడు’ అనే పేరుండటం మరో ప్రత్యేకత. దానధర్మాలు చేయడం, పవిత్ర నదులలో స్నానమాచరించడం వల్ల పుణ్యం లభిస్తుంది. ప్రకృతి వసంతానికి సిద్ధమయ్యే ఈ కాలంలో ఆధ్యాత్మిక చింతనతో గడపడం ఉత్తమం’ అంటున్నారు.
News February 18, 2026
మిరప మొక్కల వేర్లపై బొడిపెలకు కారణమేంటి?

మిరప పంటకు నులి పురుగులు ఆశించడం వల్ల మొక్కల వేర్లపై బొడిపెలు ఏర్పడతాయి. దీని వల్ల పంటకు నష్టం వాటిల్లుతుంది. ఈ నులి పురుగుల నివారణకు ఎకరాకు 100 కిలోల వేప పిండిని చల్లి, మట్టిలో కలిసే విధంగా నీరు పెట్టాలి. ఈ పురుగులు ఆశించిన పొలంలో వంగ, టమాటా, బంగాళాదుంపలను సాగు చేయకూడదు. ఆవాలు, నువ్వులు, మొక్కజొన్న, చిరుధాన్యాలతో పంట మార్పిడి చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


