News January 1, 2025

పల్నాడు: కొత్త సంవత్సరం వేళ కుటుంబంలో తీవ్ర విషాదం

image

నూతన సంవత్సరం వేళ ఓ కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకుంది. కుమారుడికి కేక్ కొనిచ్చేందుకు తీసుకెళ్తుండగా లారీ మృత్యువు రూపంలో వెంటాడింది. నకరికల్లు మండలం త్రిపురాపురం గ్రామం వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాద విషాదాంతమిది. గ్రామానికి చెందిన దుర్గారావు బైక్‌పై కుమారుడితో కలిసి వెళ్తుండగా లారీ ఢీకొనడంతో బాలుడు కార్తీక్ మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News February 21, 2026

GNT: సీఎం రాక.. భద్రతా చర్యలు పరిశీలించిన ఎస్పీ

image

గుంటూరు బొమ్మిడాల నగర్‌లోని సత్యసాయి స్పిరిచ్యువల్ సిటీలో ఆదివారం తపాలాశాఖ ఆధ్వర్యంలో డాక్ సేవక్ సమ్మేళనం జరగనుంది. CM చంద్రబాబుతో పాటూ కేంద్రమంత్రి సింథియా, పెమ్మసాని చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం భద్రతా చర్యలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

News February 21, 2026

PGRS ఫిర్యాదులపై దృష్టి పెట్టాలి: GNT ఎస్పీ

image

గుంటూరు జిల్లా పో‌‌లీస్ కార్యాలయంలో శనివారం జనవరి నెలకు సంబంధించిన నేర సమీక్షా సమావేశం జరిగింది. ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని మాట్లాడారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా కేసుల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పైసత్వరమే చర్యలు చేపట్టాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించితప్పించుకొనితిరుగుతున్న నేరస్థులను గుర్తించాలన్నారు.

News February 21, 2026

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు: SP

image

ఈ నెల 23 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పోలీసు శాఖ తరపున పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు SP వకుల్ జిందాల్ తెలిపారు. మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్ వంటివి జరగకుండా ప్రణాళికలు సిద్దం చేశామని, పరీక్షలు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో జరిగేలా చూస్తామని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో యజామాన్యాలు సీసీ కెమెరాలు అమర్చాలని ఆదేశించారు. సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు విద్యార్థులు తేవద్దన్నారు.