News January 1, 2025
దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని విషెస్

నూతన సంవత్సరం సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాదిలో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకొని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. అటు మిగతా ప్రజాప్రతినిధులూ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తున్నారు.
Similar News
News January 16, 2026
ట్యాపింగ్ కేసు.. ఇంకెంతకాలం విచారిస్తారు: సుప్రీం

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు, SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు మార్చి 10కి వాయిదా వేసింది. ఇంటరిమ్ ప్రొటెక్షన్ కొనసాగుతుందని, ప్రస్తుతానికి ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ప్రభాకర్ రావు విచారణకు గడువు ఇప్పటికే పూర్తయిందని, ఇక అదనపు విచారణ అవసరం లేదని పేర్కొంది. ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారని సిట్ను ప్రశ్నించింది.
News January 16, 2026
ఆధిక్యంలో మెజార్టీ మార్క్ దాటిన BJP కూటమి

BMC ఎన్నికల కౌంటింగ్లో BJP+ దూసుకుపోతోంది. ఏక్నాథ్ షిండే శివసేనతో కూడిన కూటమి మెజారిటీ మార్కును (114) దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం 115 వార్డుల్లో ముందంజలో ఉంది. మరోవైపు ఠాక్రే సోదరుల కూటమి 77 వార్డుల్లో మాత్రమే ముందంజలో కొనసాగుతోంది. ఇక తమ కంచుకోట పుణే, పింప్రి చించ్వివాడ్లో ‘పవార్’ల పట్టు సడలినట్లు కనిపిస్తోంది. ఇక్కడ కూడా BJP హవానే కొనసాగుతోంది.
News January 16, 2026
ఎర్ర బెండ రకాల్లో ‘కాశీ లాలిమ’ ప్రత్యేకం

‘కాశీ లాలిమ’ ఎర్ర బెండను IIVR వారణాసి రూపొందించింది. ఈ కాయలు ఆకర్షణీయంగా ఉంటాయి. దీనికి కాయపుచ్చు పురుగు ముప్పు తక్కువ. దీని వల్ల పురుగు మందుల పిచికారీ అవసరం లేదు. చెట్టు పొట్టిగా ఉంటుంది. అందకే దగ్గర దగ్గరగా మొక్కలు నాటుకోవాలి. కాయపై దురద కలిగించే నూగు ఉండదు. అందుకే ఈ బెండ కాయలను సులభంగా కోయవచ్చు. పల్లాకు వైరస్ తెగులును ఇది సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఈ కాయల్లో జిగురు తక్కువగా ఉంటుంది.


