News March 16, 2024
శ్రీకాకుళంలో 2357 కేంద్రాలలో ఎన్నికలు

జిల్లాలో 18,63520 మంది ఓటర్లు ఉండగా వారిలో 9,23,498 మంది పురుషులు, 9,39,891 స్త్రీల ఓటర్లు ఉన్నారని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. 131 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. జిల్లాలోని 2357 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయన్నారు. ఓటర్లకు ఆయా పోలింగ్ కేంద్రాలలో పలు సౌకర్యాలు సమకూర్చామన్నారు.
Similar News
News September 5, 2025
మిస్సింగ్ కేసుపై పోలీసుల శోధన.. చంపేశారంటూ కథనాలు

నరసన్నపేటకు చెందిన బంగారం వ్యాపారి వెంకట పార్వతీశ్వర గుప్త గత నెల 26న మిస్సింగ్ అయినా కేసును పోలీసులు శోధిస్తున్నారు. వ్యాపారిని హత్య చేశారని సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో కేసుకు సంబంధించిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
News September 5, 2025
శ్రీకాకుళం జిల్లాలో పలువురికి ఉద్యోగోన్నతి

శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖలో విధులు నిర్వహిస్తున్న పలువురు ఏఓలు, ఈఓపీఆర్డీలకు ఎంపీడీఓలుగా ఉద్యోగోన్నతి పొందారు. ఎస్.వాసుదేవరావు(ఆమదాలవలస), హెచ్.వి.రమణమూర్తి(కంచిలి), చిన్నమ్మడు(సారవకోట), టీ.రాజారావు(నందిగం), జె.ఆనందరావు(కోటబొమ్మాళి), ఎం.రేణుక(నరసన్నపేట), వసంతకుమారి(కొత్తూరు), ప్రభాకర్(ఈఓపీఆర్డీ-సారవకోట)లను ఉద్యోగోన్నతి కల్పిస్తూ గురువారం పంచాయతీరాజ్ కమీషనర్ ఉత్తర్వులు జారీచేశారు.
News September 5, 2025
SKLM: NMMS పరీక్షలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులు NMMS పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని DEO ఏ.రవిబాబు (ఇన్ఛార్జి ) తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 4 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునే వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.5 లక్షలలోపు ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు సంబంధిత విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.