News January 1, 2025
SKLM: ఎస్సీ కులగణన అభ్యంతరాల స్వీకరణ ఈనెల 7 వరకు పొడిగింపు

ఎస్సీ కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల (ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును ఈనెల 7 వరకు పొడిగిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. డిసెంబర్ 31తో గడువు ముగియడంతో ప్రభుత్వం మరొక వారం రోజులు పొడిగించింది. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కులగణనపై నిర్దేశిత ప్రాంతాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి స్వీకరించిన వివరాలను 11 వరకు ఆన్లైన్లో నమోదు చేస్తారన్నారు.
Similar News
News November 2, 2025
SKLM: ‘లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి’

గార(M) వమరవెల్లి డైట్ సెంటర్లో ఖాళీగా ఉన్న 3 సీనియర్ లెక్చరర్ పోస్టులు, 8 లెక్చరర్ పోస్టులు (డిప్యూటేషన్పై) నవంబర్ 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రభుత్వ జడ్పీ, మున్సిపల్ హైస్కూల్స్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్స్ లీప్ యాప్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
News November 1, 2025
ఇది శవ రాజకీయం తప్ప మరేమీ కాదు: TDP

కాశీబుగ్గలోని తమ వేంకటేశ్వరస్వామి ఆలయానికి సాధారణంగా 2 వేల మంది వస్తుంటారని.. ఇంతమంది వస్తారని ఊహించలేదని నిర్వాహకుడు హరిముకుంద్ పండా అన్నారు. రద్దీ ఇంత ఉంటుందని తెలియక పోలీసులకు చెప్పలేదని పేర్కొన్నారు. దీనిపై టీడీపీ స్పందించింది. ‘ఇంత మంది ఎప్పుడూ రాలేదని’ ఆలయ ధర్మకర్తలే అంటుంటే ముందస్తు సమాచారం ఉంది అంటూ శవ రాజకీయం చేసే పార్టీ ఏపీలో ఉండటం దురదృష్టకరమని TDP మండిపడింది.
News November 1, 2025
కాశీబుగ్గకు బయల్దేరిన లోకేష్, రామ్మోహన్ నాయుడు

కాశీబుగ్గలో వేంకటేశ్వరాలయంలో తొక్కిసలాట ఘటనపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భోపాల్ పర్యటన రద్దు చేసుకున్న ఆయన.. కాశీబుగ్గకు బయలుదేరారు. అటు మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ నుంచి కాశీబుగ్గకు బయలుదేరారు. మొదట విశాఖ వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కాశీబుగ్గకు చేరుకొని బాధితులను పరామర్శించనున్నారు.


