News January 1, 2025
అత్యంత వేడి సంవత్సరంగా 2024: IMD

భారత్లో 2024 ఏడాది అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు నమోదు చేసినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. 1901 నుంచి చూసుకుంటే సగటు ఉష్ణోగ్రత కంటే 0.65 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. 2016లో 0.54 డిగ్రీ సెల్సియస్ నమోదవ్వగా తాజాగా ఆ రికార్డు బ్రేక్ అయింది. కాగా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా 2024లో సగటు కన్నా 1.5 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు యూరోప్ ఏజెన్సీలు తెలిపాయి.
Similar News
News November 10, 2025
అందెశ్రీకి తీవ్ర అస్వస్థత

తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ రచయిత అందెశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
News November 10, 2025
ప్రకృతి సేద్యం.. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు

ప్రకృతి సేద్యంలో పెద్ద పురుగులు, చీడపీడల నివారణకు బ్రహ్మాస్త్రాన్ని రైతులు ఉపయోగిస్తున్నారు. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ దేశవాళీ ఆవు లేదా నాటు ఆవు మూత్రం – 10 లీటర్లు
☛ వేప ఆకులు – 2 కిలోలు
☛ సీతాఫలం ఆకులు – 2 కిలోలు
☛ పల్లేరు(బిల్వపత్రం) ఆకులు – 2 కిలోలు
☛ ఉమ్మెత్త ఆకులు – 2 కిలోలు అవసరం.
News November 10, 2025
బ్రహ్మాస్త్రం తయారీ.. ఉపయోగించే విధానం

వేప, సీతాఫలం, పల్లేరు, ఉమ్మెత్త ఆకులను మెత్తగానూరి ముద్దలా తయారు చేయాలి. ఒక పాత్రలో 10 లీటర్ల ఆవు మూత్రం, ఆకుల ముద్దను వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మూతపెట్టి బాగా ఉడికించి పొయ్యి మీద నుంచి దించి.. 48 గంటల పాటు చల్లారనివ్వాలి. తర్వాత గుడ్డతో వడకడితే బ్రహ్మాస్త్రం సిద్ధమైనట్లే. ఎకరాకు 100 లీటర్ల నుంచి 2 లేదా రెండున్నర లీటర్ల బ్రహ్మాస్త్రం కలిపి పిచికారీ చేయాలి. ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది.


