News January 1, 2025

NLG: నిలిచిన రేషన్ బియ్యం సరఫరా

image

డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సివిల్ సప్లై హమాలీ కార్మికులు ఈరోజు నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో గోదాముల నుంచి రేషన్ షాపులకు బియ్యం సరఫరా నిలిచిపోయింది. కార్మికుల సమ్మెతో జిల్లా వ్యాప్తంగా అన్ని గోదాములలో ఎగుమతి, దిగుమతి నిలిచిపోయింది. సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గతంలో అధికారులకు వినతిపత్రాలు ఇచ్చామని, స్పందించకపోవడంతో సమ్మెకు దిగామని హమాలీ నాయకులు అంటున్నారు. 

Similar News

News December 26, 2025

NLG: నక్సల్ ఉద్యమంలోకి వెళ్ళింది అప్పుడే..!

image

పాక చంద్రయ్య, పాపమ్మ దంపతుల ఆరుగురు సంతానంలో హనుమంతు (గణేష్) మొదటివారు. ఆయన 1960లో జన్మించారు. హనుమంతుకు ముగ్గురు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. అందరికంటే పెద్దవాడైన హనుమంతు నల్గొండలో డిగ్రీ చేస్తూ రాడికల్ యూనియన్‌లో పనిచేశారు. 45 ఏళ్ల క్రితం ఏచూరి శ్రీనివాస్ అనే ఏబీవీపీ నాయకుని హత్యలో ఆయన కీలకపాత్ర పోషించినట్లు చెబుతారు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన నక్సలైట్ ఉద్యమంలో చేరారు.

News December 26, 2025

మిర్యాలగూడ సబ్ కలెక్టర్ బదిలీ

image

మిర్యాలగూడ డివిజన్ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ బదిలీ అయ్యారు. ఆయనను నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. నారాయణ్ అమిత్ స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు.

News December 26, 2025

NLG: నేడు స్వగ్రామానికి హనుమంతు మృతదేహం

image

ఒడిశాలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన పాక హనుమంతు అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంలలో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ఇవాళ ఉదయం వారు ఒడిశాకు వెళ్లారు. హనుమంతు తోబుట్టువులంతా గ్రామానికి చేరుకోనున్నారు. 1960లో జన్మించిన హనుమంతు గ్రామంలో 7వ తరగతి వరకు, చండూరులో 10వ తరగతి వరకు చదివారు. నల్గొండలో డిగ్రీ వరకు చదివారు.