News January 2, 2025
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 3 కంపార్ట్మెంట్లలో స్వామి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న వేంకటేశ్వర స్వామిని 69,630 మంది దర్శించుకోగా, 18,965 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.13 కోట్లు వచ్చినట్లు TTD తెలిపింది.
Similar News
News December 25, 2025
ప్రధాని మోదీ ‘క్రిస్మస్’ ప్రార్థనలు

క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీలోని కేథడ్రల్ చర్చి ఆఫ్ ది రిడంప్షన్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ‘క్రిస్మస్ స్ఫూర్తి సమాజంలో సామరస్యం, సద్భావాన్ని ప్రేరేపిస్తుంది’ అని పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ పర్వదినాన దేశ పౌరులకు, ముఖ్యంగా క్రైస్తవ సమాజంలోని సోదర, సోదరీమణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.
News December 25, 2025
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్లో ఉద్యోగాలు

భోపాల్లోని ICAR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ 3 యంగ్ ప్రొఫెషనల్, సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి ఎంఎస్సీ( సాయిల్ సైన్స్/అగ్రికల్చరల్ కెమిస్ట్రీ/ అగ్రికల్చరల్ ఫిజిక్స్/ప్లాంట్ ఫిజియాలజీ), NET/GATE అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://iiss.icar.gov.in/
News December 25, 2025
హత్యకు కొన్ని గంటల ముందు హమాస్ చీఫ్ను కలిశా: గడ్కరీ

ఇరాన్ పర్యటన సందర్భంగా తనకు ఎదురైన అసాధారణ అనుభవాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పంచుకున్నారు. ‘2024 జులైలో ఇరాన్ ప్రెసిడెంట్గా మసౌద్ ప్రమాణానికి వెళ్లా. పలువురు దేశాధినేతలతోపాటు హమాస్ చీఫ్(ఇస్మాయిల్ హనియే) కూడా ఉన్నారు. ఆయన్ను నేను కలిశా. కార్యక్రమం ముగిశాక హోటల్కు చేరుకున్నా. 4AM సమయంలో హమాస్ లీడర్ <<13758903>>చనిపోయారని<<>> చెప్పారు. దీంతో షాక్కు గురయ్యా’ అని ఓ బుక్ రిలీజ్ ఈవెంట్లో తెలిపారు.


