News January 2, 2025
ప.గో: NEW YEAR.. రూ. 7.50 కోట్ల మద్యం తాగారు

నూతన సంవత్సర వేడుకలు పశ్చిమగోదావరి జిల్లాలో ఫుల్ కిక్కుతో ముగిశాయి. అయితే ఈ వేడుకల్లో మందుబాబులు మద్యం కోసం బార్లు, మద్యం షాపులకు ఎగబడ్డారు. దీంతో జిల్లాలో మంగళ, బుధ వారాల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం షాపులలో రూ. 7. 50 కోట్లు విలువచేసే మద్యం కొనుగోళ్లు జరిగాయి. అయితే సాధారణ రోజుల్లో రోజుకు రూ. 2.50 కోట్లు మాత్రమే కొనుగోళ్లు జరిగేవని సమాచారం.
Similar News
News April 23, 2025
ప.గో : టెన్త్ రిజల్ట్స్..17,695 మంది పాస్

పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ప.గో.జిల్లాలో మొత్తం 21,539 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 17,695 మంది పాసయ్యారు. 10,924 మంది బాలురు రాయగా 8,612 మంది పాసయ్యారు.10,615 మంది బాలికలు పరీక్ష రాయగా 9,083 మంది పాసయ్యారు. 82.15 పాస్ పర్సంటేజ్ తో పశ్చిమగోదావరి జిల్లా 16 వ స్థానంలో నిలిచింది.
News April 23, 2025
తాడేపల్లిగూడెం : ఆటోల దొంగ అరెస్ట్

తాడేపల్లిగూడెంలో ఆటోలు దొంగిలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని,రూ. 14 లక్షల విలువైన 7 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. వరుసగా ఆటోలు చోరీకి గురవుతున్నాయని కేసులు నమోదు అవుతుండడంతో ప్రత్యేక నిఘా పెట్టినట్లు డీఎస్పీ ఎం. విశ్వనాథ్ తెలిపారు. మామిడితోటకు చెందిన వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడిందన్నారు. పార్క్ చేసి ఉన్న ఆటోలను తెల్లారేసరికి మాయం చేసేవాడని తెలిపారు.
News April 23, 2025
పెరవలి – మార్టేరు రోడ్డులో రాకపోకలు బంద్

పెరవలి – మార్టేరు రోడ్డులో నెగ్గిపూడి నుంచి పెనుగొండ వరకు R&B రహదారి పనులు జరుగుతున్నాయి. ఈనెల 25 నుంచి జూన్ 25 వరకు నిలిపివేయనున్నట్లు R&B AE ప్రసాద్ తెలిపారు. నెగ్గిపూడిలో రహదారి నిర్మాణం, పెనుగొండలో వంతెన పనులు జరుగుతున్నాయన్నారు. మార్టేరు టు రావులపాలెం వెళ్లే వాహనాలను మార్టేరు,ఆచంట, సిద్ధాంత మీదుగా, మార్టేరు – తణుకుకు వెళ్లే వాహనాలు మార్టేరు, ఆలుమూరు, ఇరగవరం మీదుగా మళ్లించనున్నారు.