News March 16, 2024

గద్వాల: రెండు బైక్ ఢీ.. ఒకరి మృతి

image

రెండు బైకులు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన గద్వాల జిల్లాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ధరూర్ మండలం అల్వాల్ పాడ్ గ్రామానికి చెందిన రమేష్ (26) అదే గ్రామానికి చెందిన రాము.. బైక్ పై ధరూర్ మండల కేంద్రానికి వెళ్తుండగా పెట్రోల్ బంకు సమీపంలో జరిగిన ప్రమాదంలో రమేష్ మృతి చెందాగా.. రాము తీవ్రంగా గాయపడ్డాడు. రాముని ఆస్పత్రికి తరలించారు.

Similar News

News August 24, 2025

చవితి వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలి- కలెక్టర్

image

వినాయక చవితి సందర్భంగా మహబూబ్‌నగర్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం (IDOC) నందు పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్ అధ్యక్షతన వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వినాయక చవితి వేడుకలు శాంతి, సామరస్య వాతావరణంలో నిర్వహించాలన్నారు. అందరూ మత సమన్వయం పాటించాలని సూచించారు.

News August 23, 2025

MBNR: నేరచరిత్ర.. విచారణ చేపట్టండి- SP

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా ఎస్పీ డి.జానకి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన అన్ని కేసుల్లో సమగ్ర విచారణ చేపట్టి నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలని ఎస్పీ సూచించారు. SC,ST యాక్ట్, ఉమెన్ అగైనెస్ట్ కేసులు, పోక్సో కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. DSP వెంకటేశ్వర్లు, CIలు అప్పయ్య, ఇజాజ్ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

News August 22, 2025

పాలమూరు: APK ఫైల్.. బి కేర్ ఫుల్..!

image

సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి పాలమూరు జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు. SMలో ఏపీకే ఫైల్ ద్వారా ఫేక్ లింక్ పంపించి ఫోన్లను హ్యాక్ చేసి ఆర్థిక నష్టానికి గురిచేస్తున్నారన్నారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. SHARE IT