News March 16, 2024

రెండో సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ ఇదే..

image

దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ 4 నెలలు(OCT 25, 1951 నుంచి FEB 21, 1952 వరకు) సాగింది. ఆ తర్వాత అత్యంత సుదీర్ఘ కాలం ఈ ఏడాది జరగనున్నాయి. APR 19 నుంచి జూన్ 1 వరకు 44 రోజులు ప్రక్రియ కొనసాగనుంది. 1962 నుంచి 1989 మధ్య 4-10 రోజుల్లో ఎన్నికలు ముగిశాయి. అత్యల్పంగా 1980లో జనవరి 3 నుంచి 6 వరకు నాలుగు రోజుల్లోనే పూర్తయ్యాయి. 2004లో 21 రోజులు, 2009లో 30, 2014లో 36, 2019లో 39 రోజులు జరిగాయి.

Similar News

News August 25, 2025

ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

image

AP: వైద్యారోగ్యశాఖలో 185 డాక్టర్ల నియామకానికి ప్రభుత్వం <>నోటిఫికేషన్ <<>>ఇచ్చింది. ఒప్పంద విధానంలో పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ కేంద్రాల్లో ఈ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. MBBS అర్హతతో 155 వైద్యుల పోస్టులు, టెలిమెడిసిన్ హబ్‌లో 13 జనరల్ మెడిసిన్ పోస్టులు, గైనకాలజిస్టులు-3, చిన్న పిల్లల వైద్యులు-14 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి SEP 10 వరకు దరఖాస్తు చేయవచ్చు.

News August 25, 2025

ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల బదిలీ

image

దేశ వ్యాప్తంగా 14 మంది హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఇందులో ముగ్గురు న్యాయమూర్తులను ఏపీకి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. గుజరాత్ హైకోర్ట్ జడ్జి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, అలహాబాద్ హైకోర్ట్ జడ్జి జస్టిస్ డి.రమేశ్, కలకత్తా హైకోర్ట్ జడ్జి జస్టిస్ సుభేందు సమంత ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు.

News August 25, 2025

ఫిజి క్రికెట్ టీమ్‌లకు ఇండియన్ కోచ్: PM మోదీ

image

ఫిజి దేశానికి చెందిన క్రికెట్ జట్లకు ఇండియన్ కోచ్ త్వరలో శిక్షణనిస్తారని PM మోదీ ప్రకటించారు. భారత పర్యటనకు వచ్చిన ఫిజి ప్రధాని సితివేణి రబుకతో ఆయన భేటీ అయ్యారు. ‘క్రీడలు ప్రజలను గ్రౌండ్ నుంచి మైండ్ దాకా కనెక్ట్ చేస్తాయి. ఫిజిలో రగ్బీ, INDలో క్రికెట్ దానికి ఉదాహరణ. గతంలో IND రగ్బీ జట్టుకు ఫిజి కోచ్ శిక్షణనిచ్చారు’ అని గుర్తు చేశారు. కాగా ICCలో ఫిజి అసోసియేట్ మెంబర్‌గా ఉంది.