News January 2, 2025
GOOD NEWS: వారికి రూ.20,000

AP: మత్స్యకారులకు ఏప్రిల్లో రూ.20వేలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. వేట నిలిచిన సమయంలో గత ప్రభుత్వం రూ.10వేలు ఇస్తే తాము రూ.20 వేలు ఇవ్వనున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ఇక రైతులకు పెట్టుబడి సాయం కోసం పీఎం కిసాన్ మొత్తంతో కలిపి ‘అన్నదాత సుఖీభవ’ సాయం అందిస్తామన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి మెగా డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేస్తామని వివరించారు.
Similar News
News December 29, 2025
AIIMS భువనేశ్వర్లో ఉద్యోగాలు

<
News December 29, 2025
మహిళల కోసం ‘డ్రైవర్ ఉద్యోగ మేళా’

TG: HYD పోలీసుల సహకారంతో TG మహిళా భద్రతా విభాగం ‘డ్రైవర్ ఉద్యోగ మేళా’ను నిర్వహించనుంది. హైదరాబాద్ మహిళలకు బైక్ టాక్సీ, ఈ-ఆటో డ్రైవింగ్లో శిక్షణ ఇవ్వనుంది. ఉచిత డ్రైవింగ్ శిక్షణ, లైసెన్స్ జారీలో సహాయపడతారు. డ్రైవింగ్ రాకున్నా అప్లై చేయొచ్చు. ఏజ్ 21–45 ఏళ్ల మధ్య ఉండాలి. ఔత్సాహికులు JAN 3న అంబర్పేట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు వెళ్లాలి. ఈ వివరాలను హైదరాబాద్ సీపీ సజ్జనార్ <
News December 29, 2025
మాంజా వేలాడుతోంది.. జాగ్రత్త!

చైనా మాంజా యమపాశంగా మారుతోంది. సంక్రాంతి సమీపిస్తుండటంతో ఇప్పటినుంచే పిల్లలు, పెద్దలు పోటాపోటీగా గాలిపటాలు ఎగురవేస్తున్నారు. దీంతో తెగిపోయిన వాటికున్న మాంజా భవనాల మధ్యలో వేలాడుతోంది. ఇది గమనించకుండా దూసుకెళ్లడంతో బైకర్లు గాయపడుతున్నారు. అందుకే బైక్పై వెళ్లేటప్పుడు మెడకు కర్చీఫ్ కట్టుకోవడం, ఫుల్ హెల్మెట్ ధరించడం మేలు. బైకర్లు అప్రమత్తంగా ఉండాలి. మాంజా వాడకపోవడం మంచిది.


