News January 2, 2025
సిడ్నీ టెస్ట్: ఈ ముగ్గురి నుంచే ముప్పు?

BGT ఐదో టెస్ట్ జరగనున్న సిడ్నీలో ఆస్ట్రేలియా బ్యాటర్లు స్మిత్, ఖవాజా, లబుషేన్కు మంచి రికార్డు ఉంది. ఇక్కడ స్మిత్ భారత్పై 4 ఇన్నింగ్స్లలో 400 రన్స్ చేశారు. ఇందులో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలున్నాయి. ఖవాజా మొత్తంగా 12 ఇన్నింగ్స్ల్లో 832, లబుషేన్ 10 ఇన్నింగ్స్ల్లో 734 పరుగులు చేశారు. ఈ ముగ్గురిని త్వరగా ఔట్ చేస్తేనే భారత్ గెలిచేందుకు ఎక్కువగా అవకాశాలుంటాయని క్రికెట్ అనలిస్టులు చెబుతున్నారు.
Similar News
News November 13, 2025
సాయిబాబాను ఎలా పూజించాలి?

సాయిబాబా పూజలో కఠిన నియమాలేం ఉండవు. ఉపవాసం చేసేవారు సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇతరులను దూషించకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. మద్యం, మాంసం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆయన పూజలో భక్తే ప్రధానం. భక్తి లేని ఘనమైన పూజ కంటే, భక్తితో సమర్పించే ఓ పువ్వు కూడా బాబాకు సంతోషాన్నిస్తుంది. బాబాకు మన మనసనే పుష్పాన్ని సమర్పించినా చాలు. ఆయన పేరు తలచి, దానధర్మాలు చేస్తే సాయినాధుని అనుగ్రహం భక్తులపై తప్పక ఉంటుందట. <<-se>>#Pooja<<>>
News November 13, 2025
ఆలు కుదురూ చేను కుదురూ ఆనందం

“ఆలు”అంటే భార్య. “కుదురు” అంటే స్థిరత్వం లేదా సవ్యంగా ఉండటం. భార్యతో కలహాలు లేకుండా కుటుంబ జీవితం సజావుగా, సంతోషంగా, స్థిరంగా ఉన్నప్పుడూ.. చేను కుదురూ అంటే పొలం(ఆదాయ వనరులు) బాగుండి, ఆదాయం స్థిరంగా ఉన్నప్పుడే రైతు జీవితంలో నిజమైన ఆనందం, ప్రశాంతత లభిస్తాయని ఈ సామెత చెబుతుంది.
News November 13, 2025
రేపటి కోసం..

జూబ్లీహిల్స్ ప్రజలతో పాటు రాష్ట్రం మొత్తం రేపటి కోసం ఎదురు చూస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు రేపు ఉదయం మొదలుకానుంది. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టినా ఓటర్లు ఎవరికి మొగ్గు చూపుతారనేది EVMలు తేల్చనున్నాయి. అటు బిహార్లోనూ రేపు ఓట్ల లెక్కింపు జరగనుండగా ఫలితాలపై ఆ రాష్ట్రంతో పాటు దేశ ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.


