News March 17, 2024
ఏప్రిల్ 18న గెజిట్ నోటిఫికేషన్ విడుదల: కలెక్టర్ ఢిల్లీరావు

ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేడు జారీచేసిన షెడ్యూల్ ప్రకారం 2024 సాధారణ ఎన్నికల 4వ దశలో జిల్లాలోని విజయవాడ పార్లమెంటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మే 13వ తేదీన పోలింగ్, జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరుగుతాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డిల్లీరావు శనివారం తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ఏప్రిల్ 18వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.
Similar News
News September 3, 2025
పాపవినాశనం ఇసుక రీచ్పై ఈ-టెండర్లు

జిల్లాలోని ఘంటసాల మండలం పాపవినాశనం ఇసుక రీచ్ నుంచి ఇసుక తవ్వకాలకు నిబంధనల మేరకు ఈ-టెండర్లు పిలవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో జిల్లాలో ఇసుక నిల్వలపై సమీక్షించారు.
News September 2, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ చల్లపల్లిలో చోరీలకు పాల్పడుతున్న దంపతులు అరెస్ట్
☞ స్వమిత్వ సర్వేతో భూ సమస్యల పరిష్కారం: కలెక్టర్
☞ NTR: 13 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
☞ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలో భక్తుల రద్దీ
☞ ఉంగుటూరులో యూరియా కోసం బారులు తీరిన రైతులు
☞ హరికృష్ణ జయంతి.. కొడాలి నాని ట్వీట్
☞ హనుమాన్ జంక్షన్లో ఆటో డ్రైవర్ల ఆందోళన
News September 2, 2025
హరికృష్ణ జయంతి.. కొడాలి నాని ట్వీట్

హరికృష్ణ జయంతి సందర్భంగా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ‘ఎక్స్’ వేదికగా నివాళులర్పించారు. ‘నిరాడంబరత, నిజాయితీ కలగలసిన మంచి మనిషి, అనునిత్యం మా ఎదుగుదలను కాంక్షించిన నా గురువు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా స్మరించుకుంటూ’ అని రాసుకొచ్చారు. గతంలో ఆయనతో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నారు.