News January 3, 2025

రైలు పట్టాలపై పబ్‌జీ.. ముగ్గురు యువకుల మ‌ృతి

image

పబ్‌జీ ఆట పిచ్చి బిహార్‌లో ముగ్గురు టీనేజీ యువకుల ప్రాణాలు తీసింది. పశ్చిమ చంపారన్ జిల్లాకు చెందిన ముగ్గురు కుర్రాళ్లు మాన్సా తోలా ప్రాంతంలో రైలుపట్టాలపై పబ్‌జీ ఆడుతున్నారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండటంతో రైలు వస్తున్న సంగతి వారు గుర్తించలేదు. వారిపైనుంచి రైలు వెళ్లిపోయింది. దీంతో అందరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారని అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

Similar News

News February 10, 2026

చామంతి పువ్వుల పరిమాణం పెరగాలంటే..

image

చామంతి సాగులో కొన్ని సార్లు పువ్వుల పరిమాణం మరీ తక్కువగా ఉంటుంది. దీని వల్ల రైతులకు ఆశించిన ధర రాదు. చామంతి పువ్వుల పరిమాణం పెరగాలంటే.. మొక్కల తలల కత్తిరింపు చేపట్టిన తర్వాత 20 నుంచి 25 రోజులకు లీటరు నీటిలో 50 ppm జిబ్బరెల్లిక్ ఆమ్లం (50 మిల్లీ గ్రాములను) కలిపి పిచికారీ చేయాలని హార్టికల్చర్ నిపుణులు సూచిస్తున్నారు.

News February 10, 2026

మరోసారి తెరపైకి మైసూర్ సోప్, తమన్నా వివాదం

image

మైసూర్ శాండల్ సోప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నాను నియమించడంపై విమర్శలు వస్తున్నాయి. KN ప్రభుత్వ అధీనంలోని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ తయారు చేసే సబ్బుకు ముంబైలో పుట్టిన తమన్నాను రూ.6.2 కోట్ల కాంట్రాక్ట్‌కు నియమించడం కాంగ్రెస్ నాయకుల యాంటీ కన్నడ మైండ్‌సెట్‌‌కు నిదర్శనమని బీజేపీ ఎంపీ కె.సుధాకర్ ఆరోపించారు. 2025, మేలో ఓకే అయిన ఈ కాంట్రాక్ట్ నేటి నుంచి అమలులోకి వచ్చింది.

News February 10, 2026

విశాఖకు మెట్రో రైలు.. 3 రూట్లు ఇవే

image

AP: సుమారు 46KM పొడవు, 3 కారిడార్లు, రూ.11,500 కోట్ల అంచనా వ్యయంతో విశాఖ మెట్రోకు కేంద్రం ఓకే చెప్పింది.
*30-35KM దూరంతో స్టీల్ ప్లాంట్(గాజువాక)-కొమ్మాది మధ్య అత్యంత పొడవైన కారిడార్ ఏర్పాటు కానుంది.
*సిటీలో ట్రాఫిక్ తగ్గించేందుకు 5-6KM దూరంతో గురుద్వారా జంక్షన్-ఓల్డ్ పోస్టాఫీస్ వరకు రెండో కారిడార్ రానుంది.
*6-7KM దూరంతో పర్యాటకం+సిటీని కలుపుతూ తాటిచెట్లపాలెం-RK బీచ్ వరకు మూడో కారిడార్ వస్తుంది.