News January 3, 2025
శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం స్వామిని 62,085మంది దర్శించుకోగా 15,681 మంది తలనీలాల సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.4.17కోట్లు వచ్చినట్లు TTD తెలిపింది. జనవరి 10-19 వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది.
Similar News
News January 3, 2026
పంటల్లో చెదపురుగుల ఉద్ధృతి తగ్గాలంటే..

పంటల్లో చెదపురుగుల ఉద్ధృతి తగ్గాలంటే వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. గట్లపై కలుపు లేకుండా చూడాలి. బాగి చివికిన పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. పంట మార్పిడి విధానం అనుసరించాలి. పసుపును అంతర పంటగా వేసుకోవాలి. పంట వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి, తల్లి చెదపురుగును గుర్తించి నాశనం చేయాలి. చెద ఆశించిన మొక్కల మొదళ్లలో లీటర్ నీటికి క్లోరిపైరిఫాస్ 50% EC 2ml కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు.
News January 3, 2026
ఇతిహాసాలు క్విజ్ – 116

ఈరోజు ప్రశ్న: వాల్మీకీ కన్నా ముందే రామాయణంలో ఒకరు రామాయణాన్ని రాశారు. అది ఎవరు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News January 3, 2026
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడులో ఉద్యోగాలు

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు (<


